రంగారెడ్డి, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల జాతర మొదలైంది. పైరవీలు..లంచాలకు చెక్ పెట్టి.. ప్రభుత్వం పారదర్శకంగా కొలువులను భర్తీ చేస్తున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంత యువత ప్రిపరేషన్కూ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణను సైతం ఇచ్చింది. లైబ్రరీలను ఆధునీకరించి పోటీపరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచింది. జిల్లాలో ప్రభుత్వంపై పూర్తి భరోసాతో చదివి వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించారు. గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోవడంతో యువత ఆశలు వదులుకున్నది. అశాస్త్రియమైన జోనల్ వ్యవస్థతో స్థానికులకు తీవ్ర నష్టం జరిగేది. సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేయడంతో 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఏర్పడింది. స్వరాష్ట్రంలో తమ పిల్లల కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఉద్యోగులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు సర్కారు కొలువులంటే డబ్బున్నోళ్లకే భాగ్యం. పేద యువతలో టాలెంట్ ఉన్నా.. డబ్బులు చేతిలో పట్టుకుని పైరవీలు చేస్తేగానీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది కాదు. గత ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో ఉద్యోగాల భర్తీ లేక యువతీయువకులు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవితం వెళ్లదీశారు. సర్కారు కొలువుల కోసం యువత కన్న కలలను సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో నిజం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల జాతర మొదలైంది. నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకున్న జిల్లాకు చెందిన ఎందరో యువతీయువకులు కేవలం ప్రతిభతోనే ఉద్యోగాలను దక్కించుకున్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా రిక్రూట్మెంట్ నిర్వహించడంతోనే తమ పిల్లలకు ఉద్యోగాలు దక్కాయని ఉద్యోగాలు పొందిన కుటుంబాలు పేర్కొంటున్నాయి. తమ పిల్లల కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఉద్యోగుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాకారమైన నియామకాల నినాదం..
నీళ్లు, నిధులు, నియామకాల నినాదం తెలంగాణ రాష్ట్రంలో సాకారమవుతున్నది. రాష్ట్ర కల సాకారమైన నాటి నుంచే ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నది. గ్రూప్ -1, గ్రూపు-2 మొదలుకుని పోలీసు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణాధికారులు..ఇలా వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీని రాష్ట్ర సర్కారు చేపట్టింది. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల కొలువులపై యువత ఆశలు వదులుకోగా..స్వరాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లతో మళ్లీ వారి ఆశలు చిగురించాయి. ప్రతిభకు పట్టం కడుతూ..పారదర్శకంగా.. పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. వేలాది మంది నిరుద్యోగులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రభుత్వంపై పూర్తి భరోసాతో చదివి కొలువులను దక్కించుకోగలిగామని ఉద్యోగాలు పొందిన వారు గుర్తు చేస్తున్నారు. తమ పిల్లలకు ప్రభుత్వ కొలువులు వస్తాయని కలలో కూడా అనుకోలేదని, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశయాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాకారం చేశారని ఉద్యోగుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
స్థానికులకు పెద్దపీట..
అశాస్త్రీయమైన జోనల్ వ్యవస్థతో ఉమ్మడి రాష్ట్రంలో జిల్లావాసులు తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రా ప్రాంత యువతకే ఉద్యోగాలు లభించేలా పాత జోనల్ వ్యవస్థ ఉండేది. తద్వారా తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థలో మా ర్పులు, చేర్పులు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి జోన్ 5, జోన్ 6 స్థానంలో 2 మల్టీ జోన్లు, 7 కొత్త జోన్లను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా ఉద్యోగాల నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా స్థానికులకు 95 శాతం మేర ఉద్యోగాలు పొందేందుకు వీలు ఏర్పడింది. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహాయించి ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు ప్రభుత్వం పెంచిం ది. ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ఠ వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది.
ప్రిపరేషన్కు చేయూత..
పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత యువత కూడా ఉద్యోగాలకు సన్నద్ధ్దమయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చింది. స్టడీ సెంటర్లలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లైబ్రరీలను ఆధునీకరించి పోటీపరీక్షలకు అవసరమై న అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచింది. నిరుద్యోగుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పనితీరును ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు.
మా కుటుంబంలోకి వెలుగులు రానున్నాయి..
మాది కడ్తాల్ మండలంలోని గాన్గుమార్లతండాలోని మధ్యతరగతికి చెందిన గిరిజన కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక చాలా ఉండేది. కానీ అప్పటి పరిస్థితిల్లో నేను ఇంటర్ వరకే చదివాను. వారసత్వంగా వచ్చిన పొలంలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నా. నాకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నది. పిల్లలను గ్రాడ్యుయేట్ వరకు కష్టపడి చదివించా. పెద్ద కుమారుడు మునేశ్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ ఫలితాల్లో 193.4 మార్కులతో ఏఆర్ ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాడు. నేను కన్న కలల్ని కొడుకు నెరవేరుస్తుండటంతో ఎంతో ఆనందంగా ఉన్నది. మా తండాలో ఎస్ఐగా ఉద్యోగాన్ని పొందిన వ్యక్తి మొదటి వ్యక్తి మునేశ్ కావడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కావడంతోనే నా కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర ఫలాలను అందరికీ అందించేలా పాలన సాగిస్తున్నారు. ఆయనతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
-సభావట్ నర్సింగ్, గాన్గుమార్లతండా, కడ్తాల్
మా కుమారుడికి ఏఆర్ ఎస్ఐ ఉద్యోగం వచ్చింది..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాలను భారీగా భర్తీ చేస్తున్నది. రెండేండ్ల క్రితం మా కుమారుడు రమేశ్ కష్టపడి చదివి ఏఆర్ ఎస్ఐ కొలువును సాధించాడు. మాకున్న కొద్దిపాటి పొలంలో వరిని పండిస్తూ మరోవైపు కాటన్మిల్లులో కూలీలు పనిచేస్తూ ముగ్గురు పిల్లలను ఉన్నత ంగా చదివించాం. మా పిల్లలు మా కష్టాన్ని వృథా చేయలేదు. కష్టపడి చదివి పెద్దకొడుకు ఏఆర్ ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మా తండాలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తి మా కుమారుడు కావడం చాలా సంతోషంగా ఉన్నది. అందరూ అతడ్ని అభినందిస్తున్నారు.
-ఇస్లావత్ గోప్యానాయక్, కోమటి దంపతులు హర్యానాయక్ తండా, తలకొండపల్లి
ఇద్దరు కొడుకులకు సర్కారు కొలువులొచ్చాయి..
ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన కానిస్టేబుల్ ఫలితాల్లో నా ఇద్దరు కొడుకులకు ప్రభుత్వ కొలువులు వచ్చాయి. పెద్ద కుమారుడు ప్రేమ్కుమార్ సివిల్ కానిస్టేబుల్గా ఎంపిక కాగా.. రెండో కుమారుడు నిస్సిత్ కుమార్ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ఇద్దరు కుమారులు ఒకేసారి ఉద్యోగాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పారదర్శకం గా సాగుతున్నది. రూపాయి ఖర్చులేకుండా.. ఎలాంటి అవినీతి లేకుం డా అర్హులకు సర్కారు కొలువులు వస్తున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనతో పోల్చితే కేసీఆర్ పాలనలోనే అత్యధికంగా ఉద్యోగాలొచ్చాయి. 2023 కానిస్టేబుల్ ఫలితాల్లో మా గ్రామంలో 11 మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం ఎంతో అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎంతో మంది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి.
-భూపతి దాసు, నందివనపర్తి, యాచారం
వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబంలో జన్మించా. ఎన్నో కష్టాలు పడి ఉన్నత విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని చదించా. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సరిగ్గా జరుగలేదు. దీంతో నేను ఓ ప్రైవేట్ బడిలో టీచర్గా పనిచేశా. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత సర్కారీ కొలువులు భర్తీ అవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన పోలీసు నోటిఫికేషన్లో నాకు 121 మార్కులు రావడంతో సివిల్ పోలీస్ ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది.
-ఉడుతల సత్యనారాయణ, గ్రామం నాగిల్ల, మాడ్గుల మండలం
అవినీతికి చోటేలేదు..
సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పారదర్శంగా సాగుతున్నది. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుం డా నయాపైనా లంచం ఇవ్వకుండా అర్హులకే ప్రభుత్వ కొ లువులు దక్కుతున్నాయి. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి నిరుద్యోగ యువతీయువకులకు ఎన్నో ఉద్యోగాలను కల్పించి వారి భవిష్యత్ను బంగారంగా మార్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కేసీఆర్తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.
– రవీందర్గౌడ్, మిర్జాగూడ, శంకర్పల్లి