బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కురుమలకు రాయితీపై గొర్రెల పంపిణీతోపాటు మత్య్సకారులకు వంద శాతం సబ్సిడీతో చేపల పెంపకం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. కేవలం కులవృత్తుల వారే కాకుం డా రాష్ట్రంలో ని అన్ని వర్గాల వారు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ముఖ్యమంత్రి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచితంగా ప్రతినెలా 250 యూనిట్ల వరకు విద్యుత్తును సరఫరా చేస్తూ ఆదుకుంటున్నారు.
కులవృత్తుల వారికి విద్యుత్తు వినియోగం తప్పనిసరి కావడంతో సంపాదించిన మొత్తం లో చాలావరకు విద్యుత్తు బిల్లులకే చెల్లించాల్సి వచ్చేది. దీం తో వారి ఆర్థికాభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండేది. నాయీబ్రాహ్మణులు, రజకుల విజ్ఞప్తులు, ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని గత మూడేండ్ల నుంచి ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నది. కాగా జిల్లాలో ఇప్పటివరకు 1,064 హెయిర్ సెలూన్లకు రూ.2 కోట్లు, 1,601 లాండ్రీ షాపులకు రూ. 3 కోట్ల మేర సబ్సిడీని ప్రభుత్వం అందించింది. ప్రతినెలా విద్యు త్తు బిల్లులు చెల్లించాల్సిన బాధ తప్పడంతో తాము ఆర్థికంగా ఎదుగుతున్నామని.. తమ అభ్యు న్నతికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు అంటూ నాయీబ్రాహ్మణులు, రజకులు స్పష్టం చేస్తున్నారు.
-వికారాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)
సాంకేతిక అభివృద్ధితో కటింగ్ షాపుల్లో పలు రకాల యంత్రా లను వాడుతున్నాం. దీంతో అధికంగా వచ్చే విద్యుత్తు బిల్లు ను చెల్లించలేని స్థితిలో ఉన్న మా కులవృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందించడం అదృష్టంగా భావిస్తున్నా. పేదల బాధలు తెలుసుకొని ఎప్పటి సమస్యలను పరిష్కస్తున్నా సీఎం కేసీఆర్ నిజమైన దేవుడు. వారు చేస్తున్న మేలు ఈ జన్మలో మరవలేనిది. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ సారుకే నా మద్దతు.
-రఘు, తాండూరు
సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నా నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తూ వారు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నది. పెరిగిన అద్దెలు, కరెంట్ బిల్లులతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. గతంలో కరెంట్ బిల్లులు చూస్తేనే భయపడాల్సి వచ్చేది. 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తుండటంతో సంతోషంగా కులవృత్తిని కొనసాగిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు అండ గా ఉంటు న్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
-రమేశ్, నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్
లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తుండటంతో ఎంతో మేలు జరుగుతున్నది. విద్యుత్తు బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న మాకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేయడం సంతోషం. సీఎం కేసీఆర్ కులవృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-చాకలి బస్వరాజ్, తాండూరు
కులవృత్తిని నమ్ముకుని దుస్తులను ఐరన్ చేసే మాకు కొన్ని సందర్భాల్లో బొగ్గులు కూడా లభించకపోవడంతో వృత్తిని మానేయాల్సి వచ్చింది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్ను వినియోగిస్తుండటం తో బొగ్గులు దొరకడంలేదు. అయితే మా బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ లాండ్రీ, దోభీఘాట్లకు ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుండటంతో కుల వృత్తిని చేసుకుంటూ సగర్వంగా బతుకుతున్నాం.
-లక్ష్మణ్, గరీబ్నగర్, వికారాబాద్