షాబాద్, జూన్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలు గు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజలు అధికంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. శిబిరాలకు వచ్చిన వారికి వైద్యులు కంటి పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి మందులతోపాటు అద్దాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో శుక్రవారం 80 బృం దాల ద్వారా నిర్వహించిన శిబిరాల్లో 10,013 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. అం దులో 426 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 492 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట, జూన్ 9 : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి అనూ హ్య స్పందన లభిస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. 42 కంటి వెలు గు శిబిరాల్లో వైద్యబృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతోపాటు విటమిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 497 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అందు లో 49 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. 40 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 565 గ్రామాలు, 97 వార్డుల్లో కంటి వెలు గు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.