శంకర్పల్లి, మే 25 : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుతం ఇప్పటికే చాలా వరకు నెరవేర్చింది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను పేద ప్రజలకు నిర్మించి ఇ స్తానని హమీ ఇచ్చారు. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావడం తో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నేరుగా సేకరించేందుకు పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి పారదర్శంగా అర్హుల జాబితాను తయారు చేస్తున్నారు.
శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో..
శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 1500 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఇండ్లను అర్హులకు ఇచ్చేందుకు అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధంగా ఉంచారు. అలాగే మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్లో 40 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 20 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 20 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఇండ్లను జనవాడ, మిర్జాగూడ గ్రామంలో ఉన్న పేద ప్రజలకు మంజూరు చేసింది. ప్రస్తుతం జనవాడ గ్రామానికి 10, మిర్జాగూడ గ్రామానికి 10 ఇండ్లను లాటరీ పద్ధతిలో అర్హులకు అందజేయనున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.
అర్హులకే డబుల్ బెడ్ రూం ఇండ్లు
శంకర్పల్లి మండలంలో అర్హులైన పేద వారికే డబుల్ బెడ్ రూం ఇండ్లను అందిస్తాం. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు ఇండ్లను నిర్మించి ఇస్తున్నారు. పేద ప్రజలు ఆత్మ గౌవరంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. అధికారులు ఇచ్చిన లబ్ధి దారుల వివరాలు మరోసారి పరిశీలించి పారదర్శకంగా ఇండ్ల పంపిణీ జరుగుతుంది. అన్ని వసతులతో ఇండ్ల నిర్మాణం పూర్తయింది. సీఎం కేసీఆర్కు పేద ప్రజలు అండగా నిలవాలి.
– గోవర్ధనర్రెడ్డి, ఎంపీపీ, శంకర్పల్లి
పారదర్శకంగా ఇండ్ల పంపిణీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి పేద ప్రజలకు ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో పేద ప్రజలను గుర్తించి అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి పేద వాడు సొంతింట్లో ఉండాలని సీఎం కేసీఆర్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అధికారుల సమక్షంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పంపిణీ చేస్తాం.
– విజయలక్ష్మీప్రవీణ్కుమార్, చైర్పర్సన్, మున్సిపాలిటీ, శంకర్పల్లి