అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 89 మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అత్యధికంగా తాండూరులో 28 మంది అభ్యర్థులు 37 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా.. అత్యల్పంగా కొడంగల్ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అలాగే పరిగిలో 26 మంది అభ్యర్థులు 48 సెట్లు, వికారాబాద్లో 19 మంది అభ్యర్థులు.. 35 సెట్ల నామినేషన్లు వేశారు. ఈ నెల 13న ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనుండగా.. 15 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
-వికారాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈనెల 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 89 మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అత్యధికంగా తాండూ రు నుంచి దాఖలుకాగా.. కొడంగల్ నుంచి అత్యల్పంగా దాఖలయ్యాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన..ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. అదేవిధంగా ఈనెల 30న ఎన్నికల పోలింగ్ జరుగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్ర క్రియతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు.
89 మంది అభ్యర్థులు
జిల్లాలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా పార్టీలకు చెందిన 19 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున డాక్టర్ మెతుకు ఆనంద్, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్కుమార్, బీజేపీ నుంచి పెద్దింటి నవీన్తోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. తాండూరు నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు 37 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి పైలట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ నుంచి బుయ్యని మనోహర్రెడ్డి, జనసేన(బీజేపీ)నుంచి శంకర్గౌడ్, వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు.. అదేవిధంగా పరిగి నియోజకవర్గం నుంచి 26 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల మహేశ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి రామ్మోహన్రెడ్డి, బీజేపీ నుంచి మారుతీకిరణ్, వివిధ పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు.. కొడంగల్ నియోజకవర్గంలో అత్యల్పంగా 16 మంది ఆయా పార్టీల అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి పట్నం నరేందర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి రమేశ్తోపాటు వివిధ పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.