పెద్దేముల్, ఫిబ్రవరి 24 : ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయిన ఆర్టీసీ బస్సు కల్వర్టుపైకి దూసుకెళ్లిన సంఘటన శనివారం పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు-సంగారెడ్డి ప్రధాన రహదారిలో సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, తాండూరు వైపు నుంచి వస్తున్న ఆటో ఎదురెదురుగా వస్తున్న క్రమంలో ఆటో ఒక్కసారిగా బస్సువైపునకు రావడంతో బస్సు డ్రైవర్ ఆటోను తప్పించే క్రమంలో కోట్పల్లి ప్రాజెక్టు ప్రధాన కల్వర్టుపైకి దూసుకెళ్లింది.
బస్సులో మొత్తం సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా, అందులో చిన్న పాప, మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.