కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన రవళికి రూ. 60వేలు, తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామానికి చెందిన రమేశ్కి రూ. 24వేలు, కల్వకుర్తి మండలం మార్చాల గ్రామానికి చెందిన పార్వతమ్మకి రూ. 60వేలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, హన్మానాయక్, శ్రీనివాస్రెడ్డి, నరేశ్నాయక్, గోపినాయక్, చంద్రునాయక్, గాంస్యానాయక్ పాల్గొన్నారు.