చేవెళ్ల టౌన్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీడీపీవో శోభారాణి, చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని సీడీపీవో కార్యాలయంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు సీడీపీవో ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాల్లో తల్లిదండ్రులు లేని 23మంది అనాథ పిల్లలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వీరికి ప్రతినెల రెండు వేల రూపాయులు కూడా అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అనాథ పిల్లలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు, సిబ్బంది దేవేందర్, అనాథ పిల్లలు ఉన్నారు.