కడ్తాల్, జనవరి 6 : నిరు పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దారెడ్డిచెరువు తండాకు చెందిన సువాలీకి రూ.2 లక్షలు, ఆమనగల్లు మండలం నుచ్చుగుట్ట తండాకి చెందిన మస్రుకి రూ.56 వేలు, మేడిగడ్డ తండాకి చెందిన వనితకు రూ.40 వేలు, వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన శేఖర్కు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఆ చెక్కలను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భిక్కూనాయక్, నెజ్యానాయక్, రాములు, దామోదర్, శేఖర్, కృష్ణ, భీష్మ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మాడ్గుల : పేదలకు సీఎం సహాయనిధి వరంలాంటిది అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని కొర్ర తండా గ్రామానికి చెందిన రతన్కు లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచ్ రమేశ్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు రాజూగౌడ్, శ్రీను, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగలు: కోనాపూర్ గేట్ తండాకు చెందిన మేఘావత్ నీలాకి రూ. 20 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో మంజూరైంది. ఆ చెక్కును లబ్ధిదారు కుటుంబ సభ్యుడికి శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్ ఎమ్మెల్యే తరఫున అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నేనావత్ నరేందర్, భీమయ్య, చందు, తోట కృష్ణ, కాలే విక్రమ్, కంబాలపల్లి అల్లాజీ, జంతుక గిరి, సురేశ్, శ్రావణ్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.