వికారాబాద్, సెప్టెంబర్ 25 : జిల్లాలోని 436 మంది పోడు భూముల లబ్ధిదారులకు వారి పొలాల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సం బంధించి వెంటనే చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. వికారాబాద్ జిల్లాలోని 10 మండలాల్లో అర్హులైన 436 మంది రైతులకు పోడు ప ట్టాలు అందజేశామన్నారు. ఆ రైతులకు వారి పొ లాల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసేందు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు.
ఇం దుకు సంబంధించి గిరిజన సంక్షేమ, విద్యుత్, అ టవీ శాఖలతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు అవసరమైన ఎస్టిమేషన్లు, త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్లు, అటవీ శాఖ అనుమతులు తదితర అంశాలపై వెం టనే నివేదికలు అందజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్న వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఆరోగ్యరక్ష ట్రస్ట్ తరఫున మీ సేవ కేంద్రాల్లు, సీఎస్సీ సెంటర్లలో, ఆరోగ్యశ్రీ సిబ్బం ది నమోదు చేస్తున్నారని తెలిపారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రెండు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే వారని, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డు దారులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
ప్రజావాణికి 168 ఫిర్యాదులు
అనంతరం ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ నారాయణరెడ్డి స్వీకరించారు. ప్రజావాణికి 168 ఫిర్యాదులు అం దాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కా రం కోసం వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, లింగ్యానాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణఅమిత్తో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.