షాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులో చిక్కుకుని మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలం పులుమామిడిలో ఒక వ్యక్తి, శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో మరో వ్యక్తి భారీ వర్షాలతో వాగులు రావడంతో అసంపూర్తిగా ఉన్న వంతెనల వద్ద వాగుల్లో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే వారి కుటుంభాలకు భరోసా కల్పించాలని కోరారు.