ఊరూరా పల్లె, బస్తీ దవాఖానలు, కొండాపూర్లో జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లతో జిల్లా మెడికల్ హబ్గా అవతరిస్తున్నది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు సమకూరుస్తున్నది. ప్రభుత్వ దవాఖానల స్థాయిని పెంచడంతోపాటు పల్లె, బస్తీ దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుతో గ్రామీణ ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యం చేరువైంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేసి జిల్లావాసుల కలను నెరవేర్చారు. కందుకూరులో రూ.176 కోట్లతో చేపట్టనున్న ఈ కాలేజీ నిర్మాణ పనులకు ఆదివారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. త్వరలోనే వంద ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. ఫలితంగా మరింత మెరుగైన వైద్యం ప్రజలకు అందనున్నది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చొరవపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్య విప్లవం కొనసాగుతుండగా.. జిల్లాలోనూ అదే ఒరవడి సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా ముం దుకెళ్తున్నారు. ఆరోగ్య తెలంగాణ సాకారం దిశగా వైద్యారోగ్య శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ దవాఖానల స్థాయిని పెంచడంతోపాటు పల్లె, బస్తీ దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుతో అందరికీ ఉచితంగా అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కందుకూరుకు మెడికల్ కాలేజీని మంజూరు చేసి ఈ ప్రాంత చిరకాల కోరికను నెరవేర్చారు. రూ.176 కోట్లతో చేపట్టనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు ఆదివారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. మెడికల్ హబ్గా మారిన జిల్లాలో త్వరలోనే వంద ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానుండడంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి..
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న ల క్ష్యంతో వైద్యారోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్ ప్ర తి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చిన సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మంజూరు చేయడంతోపాటు పరిపాలనాఅనుమతులు ఇచ్చి రూ.176కోట్లను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదివారం కందుకూరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి శంకుస్థాప న చేయనున్నారు.
ఈ నిధులతో 450 పడకల సామర్థ్యంతో దవాఖాన నిర్మాణంతోపాటు ల్యాబ్లు, సెమినార్ హాళ్లు, అనుబంధ దవాఖాన భవనాలు, హాస్టల్ భవ న నిర్మాణం ఇతర వసతులను కల్పించనున్నారు. వంద ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో కాలేజీ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నది. మెడికల్ కళాశాల ఏర్పాటుతో మహేశ్వరం నియోజకవర్గం వైద్యపరంగా మరింత అభివృద్ధి చెందనున్నది. వివిధ రకాల శస్త్ర చికిత్సలను ఇక్కడే చేసే సదుపాయం అందుబాటులోకి రానున్నది. ఈ ప్రాంత విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానిక కళాశాలలోనే మెడిసిన్ చేసే భాగ్యం త్వరలోనే కలుగనున్నది.
కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలో ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్కు దీటుగా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాయి. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు జిల్లాలోని ప్రజలకు నిరంతరాయంగా ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి. కొండాపూర్ దవాఖానను ప్రభుత్వం జిల్లా ఆస్పత్రిగా వంద పడకల సామర్థ్యానికి పెంచింది. రెండు ఆక్సిజన్ ప్లాం ట్లు, రెండు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, రెండు వెంటిలేటర్ల సదుపాయాన్ని ఇక్కడి దవాఖానలో కల్పించారు. వనస్థలిపురం ఏరియా దవాఖానల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు, డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల దవాఖానల్లోనూ డయాలసిస్ సేవలు అందుతున్నాయి.
గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ఆధునిక హంగులతో 1200 పడకల సామర్థ్యంతో వైద్యసేవలను అందిస్తున్నది. నిరుపేద బస్తీల్లో 59 బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాంతాల్లో తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 82 పల్లె దవాఖానలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. చైతన్యపురిలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగానే అందించేందుకు ప్రభుత్వం డయాగ్నస్టిక్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న 57 పరీక్షలను 134కు పెంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్ సదుపాయాలను సైతం ప్రభుత్వం కల్పించింది. ప్రైవేట్ దవాఖానల్లో ఎన్ని రకాల టెస్టులు చేస్తారో! అన్ని పరీక్షలను ఉచితంగానే చేసి 24 గంటల్లోనే పేషెంట్ల మొబైల్ ఫోన్లకు టీ డయాగ్నస్టిక్ సెంటర్ ఫలితాలను అందిస్తున్నది. ఒకప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా ప్రైవేట్ దవాఖానలకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. కానీ, నేడు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు అందుబాటులోకి రావడంతో ప్రసవం మొదలుకుని ఏ చిన్న రోగం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూసేలా సీఎం కేసీఆర్ వసతులను మెరుగుపర్చారు.
చిరకాల స్వప్నం నెరవేరింది..
జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ఇప్పటికే అనేక ఆసుపత్రులను సకల వసతులతో అందుబాటులోకి తెచ్చాం. జిల్లాప్రజలకు అధునాతన వైద్యం అందించాలన్న సంకల్పంతో జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ మంజూరు చేసి నిధులను కూడా కేటాయించడం సంతోషకరం. ఒకప్పుడు ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం తెలంగాణలోనే ఎం బీబీఎస్ విద్య విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది కేవలం సీఎం కేసీఆర్ సర్కారు మాత్రమే. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి