ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకంటే ఆంధ్రోళ్లే ఉద్యోగాలను కొల్లగొట్టారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలోనే భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. వరుస నోటిఫికేషన్లు వేస్తూ, ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీంతో ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు సర్కారు నౌకర్లు సాధించారు. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచడంతో నిరుద్యోగులు కొలువు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
– వికారాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యా యం జరిగింది. ముఖ్యం గా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పోస్టుల భర్తీ జరిగినప్పటికీ స్థానికులైన తెలంగాణ వారి కంటే ఆంధ్ర ప్రాంతం వారే ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై ఎంత ఉద్యమించినా ఫలితంలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించడంతో జల వనరులకు ఢోకాలేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపు పారదర్శకంగా జరుగుతున్నది. ఎనిమిదేండ్లకాలంలో నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాలను కల్పించేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం.
టీఎస్పీఎస్సీ ద్వారా లంచాల్లేవు.. పైరవీల్లేవు.. నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిభకు పట్టం కడుతున్నది. పారదర్శకతకు కేరాఫ్గా టీఎస్పీఎస్సీ నిలుస్తున్నది. ఇప్పటికే లక్షలాది ఉద్యోగులతో నిరుద్యోగులకు భరోసా కల్పించింది. నోటిఫికేషన్ వచ్చింది మొదలు ఫలితాలు ప్రకటించే వరకూ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. దీంతో పేద, మధ్యతరగతి, కూలినాలీ చేసుకునేవా రు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో టీఎస్పీఎస్సీ నియామక ప్రక్రియలో ఉద్యోగాలు సాధించారు. ఆనందంగా కొలువులు చేసుకుంటున్నా రు.
జిల్లాలోని ధారూర్ మండలం స్టేషన్ ధారూర్ గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అదేవిధంగా కొడంగల్ మున్సి పాలిటీ పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన వదిన, మరిది ఉపాధ్యాయురాలిగా, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించారు. అదేవిధంగా దోమ మండలం దిర్సంపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికయ్యా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగాలను సాధిస్తున్నారు. నోటిఫికేషన్లు జారీ అవుతుండటంతో నిరుద్యోగులు కొలువు లు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ధారూరు మండలంలోని ధారూరు స్టేషన్ గ్రామానికి చెందిన ముడావత్ భీమ్లానాయక్కు ఆరుగురు కుమా రులు, ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే పిల్లలంతా పదేండ్లలోపు ఉన్నప్పుడే భీమ్లానాయక్ మరణించడంతో అందరూ కూలీ పనులు చేసుకుంటూ బతికారు. సొంతూరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సెలవు రోజుల్లో వ్యవసాయ పనులకు వెళ్లి కష్టపడి చదివారు. కష్టానికి ఫలితంగా ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. 2018 పోలీస్ రిక్రూట్మెంట్లో పెద్ద కుమారుడు మోహన్ కానిస్టేబుల్గా ఎంపిక కాగా.. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధం గా 2020లో మరో ఇద్దరు కుమారులు రమేశ్, సంతోష్లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. రమేశ్ మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో పని చేస్తుండగా.. సంతోష్ సైబరాబాద్ హెడ్ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్నాడు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాతే భారీగా ఉద్యోగాల భర్తీ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ భారీగా ప్రభు త్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ ప్రాంత యువకులకు తీవ్ర అన్యాయం జరిగింది. సీఎం ఆదేశాలతో కొత్త జోన్ల ఏర్పాటుతోపాటు వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తుండటం చాలా సంతోషకరం. నూతన జోనల్ విధానాన్ని తీసుకురావడంతో చార్మినార్ జోన్లోనే అధికంగా ఉద్యోగాలున్నాయి. కాగా ఇంట్లో ఇద్దరికీ, ముగ్గురికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. నేను (ఆర్.అజయ్కుమార్రెడ్డి) 2016 కానిస్టేబుల్గా ఎంపికై ప్రస్తుతం లక్డీకాపూల్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తుండగా నా తమ్ముడు ఆర్.విజయ్కుమార్రెడ్డి 2018 లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై, తదనంతరం వీఆర్ వోగా ఎంపికై, ప్రస్తుతం ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.
– అజయ్కుమార్ రెడ్డి, విజయ్కుమార్రెడ్డి, బొంపల్లి, దోమ మండలం
తెలంగాణ ప్రభుత్వంతో కాలం కలిసొచ్చింది
2014లో డీఎడ్(టీటీసీ) పూర్తి చేశా. ఆ తర్వాత డిగ్రీ చదివా. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ నోటిఫికేషన్ ను 2017లో జారీ చేయడంతో కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాన్ని సాధించా. 2019లో తాండూరు నియోజక వర్గంలోని బషీరాబాద్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా చేరా. చదువు పూర్తి కాగానే తెలంగాణ ప్ర భుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ను జారీ చేయడంతో టీచర్ జాబ్ను సాధించడం చా లా సంతోషంగా ఉన్నది.
– బాకారం భువనేశ్వరి, టీచర్, కొడంగల్
వరుసగా నోటిఫికేషన్లు…
నేను 2013లో డిగ్రీ పూర్తి చేశా. 2016లో తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో అందులో అర్హత సాధించి, 20 16లో శిక్షణను పూ ర్తి చేశా. 2017లో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో పని చేస్తున్నా. రెండేండ్ల కాలంలోనే మా ఇంట్లో మా వదినమ్మ 2019లో ఉపాధ్యాయురాలిగా, 2017లో నేను కానిస్టేబుల్గా ఉద్యోగాల్లో చేరాం. చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
-బాకారం బస్వరాజ్, కానిస్టేబుల్, కొడంగల్
తెలంగాణ వచ్చాకే ఉద్యోగాలు సాధించాం..
రాష్ట్రమొచ్చాకే నిరుద్యోగులకు మంచి రోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ దశలవారీగా నోటిఫికేషన్లు వేస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టీఆర్టీ-2017లో భార్యాభర్తలం ఒకేసారి టీచర్ ఉద్యోగాలను సాధించాం. ప్రస్తుతం కోట్పల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉపాధ్యాయుడిగా.. నా భార్య పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి హరిజన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కృష్ణయ్య, గీత ఉపాధ్యాయ దంపతులు