షాబాద్, జనవరి 29 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలను ఢిల్లీకి పంపితే తీవ్ర నష్టమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల కేజీఆర్ గార్డెన్లో..అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని పరిగిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డిలతో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వదించి మీ దగ్గరికి పంపిస్తే నేడు ఆయన అందరివాడుగా.. ఆప్తబంధువుడిలా జనం మధ్యలోనే ఉంటున్నారన్నారు. పరిగిలో మహేశ్రెడ్డిని ఓడించినందుకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని, రానున్న ఎన్నికల్లో కారు దూసుకెళ్లాలని.. రంజిత్రెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్రెడ్డి గెలుస్తారనే నమ్మకం ఉండేదని.. కులకచర్లలో ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఆ ఊపు, జోష్ను నా కండ్లారా చూశానని.. కేసీఆర్ పరిగికి వచ్చినప్పుడు కూడా చాలా బాగుందని చెప్పారని, ఆ విశ్వాసంతోనే మహేశ్రెడ్డికి మీరు గెలుస్తున్నారని చెప్పినట్లు తెలిపారు.
ప్రజలు మనకు 39 సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా ఉండాలని ఆశీర్వదించారన్నారు. 14 ఏండ్లపాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమంలో పరుగులు తీసింది.. ఆ తర్వాత తెలంగాణలోని ప్రతి గల్లీలోనూ ఉరికింది.. 24 ఏండ్ల పాటు 100 స్పీడులో పరుగులు పెట్టి ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే సర్వీసింగ్కు వెళ్లిందన్నారు. అన్ని సెట్ చేసుకుని చేవెళ్ల హైవే ఎక్కిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వంద స్పీడ్తో దూసుకెళ్లాలని ..చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మార్పు అనేది అప్పుడే ప్రారంభమైనదని.. దొంగ మాటలు నమ్మి కేసీఆర్ను పోగొట్టుకున్నామని అన్ని వర్గాల వారు బాధపడుతున్నారన్నారు.
పరిగిలో మహేశ్రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రతిపక్షంగా ముందుకు పోదామన్నారు. పరిగిలో అసెంబ్లీ ఎన్నికల్లో మోసం జరిగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో దానిని సరి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని, ఎరువులు, విత్తనాల షాపుల ఎదుట లైన్లు కనబడుతున్నాయని పేర్కొన్నారు. ఉచిత బస్సుల కారణంగా ఆటో డ్రైవర్లు రోడ్డుపై పడ్డారని.. రైతుబంధు నిధులు సకాలంలో జమ కాకపోవడం తో రైతులు పంటలను సాగు చేసుకోలేకపోతున్నారని ఆరోపించారు. రైతుభరోసా దేవుడెరుగు…కేసీఆర్ ప్రభు త్వం ఇచ్చినట్లు రూ.10 వేల చొప్పున కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.
మార్చి 17 తేదీతో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుందని.. అప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం చేస్తామన్నారు. గ్రామాల్లో రైతుల కష్టాలు, మహిళల బాధలు, రూ.4వేల పింఛన్ సక్రమంగా పంపిణీ కాకపోవడంతో అన్ని వర్గాల వారు బాధపడుతున్న వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం ద్వారా పార్లమెంటు నియోజకవర్గమంతా చైతన్యవంతమవుతుందన్నారు. ప్రతి బూత్ నుంచి సోషల్ వారియల్ కావాలన్నారు.
చేవెళ్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలతో భూముల ధరలకు రెక్కలొచ్చాయన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని అప్పట్లో ఎంతోమంది మాట్లాడారని.. కానీ ఇప్పుడు కోట్లల్లో పలుకుతున్నాయన్నారు. బీజేపీతో దేశానికి, రాష్ర్టానికి ఒరిగేమీలేదన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వమేనని, ఐటీఐఆర్ రద్దుపై ఎంపీ రంజిత్రెడ్డి పలుమార్లు ప్రశ్నించినా బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినబడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను లోక్సభకు పంపించాలన్నారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే లోక్సభలో గట్టిగా మాట్లాడిన రంజిత్రెడ్డి మీ అండగా ఉన్నారన్నారు. పార్టీలో ఉన్న నాయకులను సమన్వయం చేయడంలో కొంత లోపం జరిగిన మాట వాస్తవవేనని, భవిష్యత్తులో ఆ లోటును పూడ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ..కార్యకర్తలు, నాయకులు చిన్న, చిన్న వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
రాబోవు రోజుల్లో ఒక దాని తర్వాత మరిన్ని ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో పునాదిని బలంగా వేద్దామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు గోవర్ధ్దన్రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, ఎంపీలు కరణం అరవిందరావు, మల్లేశం, జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, మాలతి, నాగారెడ్డి, హరిప్రియ, మేఘమాల, రాందాస్నాయక్, శ్రీనివాస్రెడ్డి, అశోక్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, పరిగి పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి,
రంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ల ఆంజనేయులు, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొప్పుల అనిల్రెడ్డి, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, ప్రభాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, ఆంజనేయులు, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, పెంటారెడ్డి, వెంకటయ్య, నర్సింహారెడ్డి, రాజేందర్గౌడ్, లక్ష్మీకాంత్రెడ్డి, మల్లేశ్, శ్రీరాంరెడ్డి, గిరిధర్రెడ్డి సురేందర్, రాజేందర్, ప్రవీణ్కుమార్రెడ్డి, సుధాకర్రెడ్డి, హరికృష్ణ, గోపాల్రెడ్డి, సుభాష్చందర్రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారు. ప్రజాతీర్పును గౌరవిద్దాం. ఓడిపోయినంత మాత్రనా కుంగిపోవద్దు. పార్టీని మరింత బలోపేతం చేద్దాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఆ తర్వాత జరుగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. పరిగి నియోజకవర్గంలో గత నలభై ఏండ్లుగా స్థానిక సంస్థల్లో మనమే మెజారిటీ స్థానాలను సాధించాం. ఆ పరంపరను ఇప్పుడూ కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేవరకూ ప్రజల తరఫున పోరాడుదాం.
– మహేశ్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పరిగి
ప్రజలతో నిత్యం మమేకమయ్యే రంజిత్రెడ్డితోనే చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. గ్రామాలకెళ్తే హస్తం పార్టీని నమ్మి మోసపోయా మనే బాధ కనిపిస్తున్నది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పెట్టింది పేరు ఆ పార్టీ. పూడూరులో ఏర్పాటు చేయనున్న రాడార్ కేంద్రంతో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనే భ్రమను కల్పిస్తున్నది. 2009లోనే రాడార్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన రాగా.. కేసీఆర్ దాన్ని పక్కన పెట్టారు. రాడార్ కేంద్రం ఏర్పాటుతో వెలువడే రేడియేషన్తో ప్రజలు, పక్షులు, జీవరాశులకు ముప్పు జరుగుతుంది.
– మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
రామన్న మీరు అనుకుని వచ్చారో…అనుకోకుండా వచ్చారో తెలియదు గానీ.. చేవెళ్ల నుంచి ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా.. ఏ పార్టీ వారు చేపట్టినా పెద్ద విజయమే సాధించింది. ఈ రోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమం కూడా అదే విధంగా ఘనవిజయం సాధిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తే.. చేవెళ్ల నియోజకవర్గంలో మాత్రం కారు గుర్తు జయభేరి మోగించింది.
ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్రెడ్డిని మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపిస్తే మన సమస్యలపై పోరాడుతారు. మనకు అండగా ఉంటారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేసి మరోసారి గులాబీ జెండాను తెలంగాణలో అధికారంలోకి తీసుకొద్దాం.