హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉన్నది. ఈ సమావేశంలోనే వివిధ ప్రభుత్వ బిల్లులకు ఆమోదం పొందుతారని తెలుస్తున్నది.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించే వివిధ సంక్షేమ పథకాలపై రూపొందించిన బిల్లులను ఈ మంత్రివర్గ సమావేశాల్లోనే ఆమోదించే అవకాశం ఉన్నదని సమాచారం.