ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 4 : నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల్లో తగిన గుర్తింపు లభిస్తుందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా నియమితులైన సత్తు వెంకటరమణారెడ్డి, పాలకవర్గం సభ్యులు ఆదివారం మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలుపగా.. ర్మన్, డైరెక్టర్లకు మంత్రి అభినందనలు తెలిపారు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే వారికి తగు సమయంలో తగు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు అవకాశాల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదని.. చిత్తశుద్ధితో పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు.
సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యారంగం అద్భుత ప్రగతి సాధిస్తున్నదని, గ్రంథాలయాలు కూడా జవసత్వాలను కూడగట్టుకున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలు గ్రంథాలయాల అభివృద్ధిని విస్మరించాయని, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గ్రంథాలయాలను చేరువ చేస్తున్నదని పేర్కొన్నారు. మారుమూల పల్లెలకు గ్రంథాలయ సేవలు విస్తరించేలా కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నక్షత్రం, రాధమ్మ, మాధవి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్, నాయకులు సురేశ్, జంగయ్య, రాములు, ఎల్లారెడ్డి, రాజేశ్గౌడ్, రసూల్ఖాన్, రాంరెడ్డి, అర్జున్, రాజు పాల్గొన్నారు.