తాండూరు, ఫిబ్రవరి 15: గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సేవాలాల్ 284వ జయంతి వేడుకలు తాండూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణంలోని సేవాలాల్ విగ్రహానికి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి కుమారుడు రినీశ్రెడ్డి గిరిజన నా యకులతో కలిసి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ సర్కార్ హయాంలో అధికారికంగా సేవాల్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ఐదువం దల జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయితీలుగా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సర్కార్ గిరిజన సంక్షేమ వసతి గృహాలతో పాటు విదేశాల్లో చదువుకు విద్యార్థులకు రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ తరహాలో తాండూరులో కూడా ఆధునిక హంగులతో జంజారా భవన నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజూగౌడ్ మాట్లాడుతూ గిరిజనులను ఏకం చేయడానికి అనేక ప్రాంతాలు తిరిగి కులమతాలకు అతీతంగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని గుర్తుచేశారు. పెద్దేముల్ జడ్పీటీసీ ధారా సింగ్, బంజారా సంఘం నాయకులు, విఠల్నాయక్, వాసుపవార్ మాట్లాడుతూ సేవాలాల్ జీవితాన్ని పాఠ్యంశాల్లో చేర్చడంతో పాటు సేవాలాల్ జయంతి రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.
పరిగి టౌన్, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం పరిగి కేఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్తని తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సేవాలాల్ జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేశా రు. . అంతకు ముందు నిర్వహించిన సేవాలాల్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన నాయకులు, విద్యార్థులతో కలిసి సేవాలాల్ ఊరేగింపులో పాల్గొన్నారు.కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, పరిగి, దోమ ఎంపీపీలు కరణం అరవింద్రావు, సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, బీఆర్ఎస్నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, హన్మంతురెడ్డి, రవికుమార్. సేవ్యానాయక్, శంకర్నాయక్, ఎంఈవో హరిశ్చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ధారూరు, ఫిబ్రవరి15: దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలో సేవాలాల్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి క్లబ్ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అనంత్రెడ్డి, రాజూనాయక్, విజయ్కుమార్, బాల్నాయక్, గోపాల్ నాయక్, వెంకటేశ్ ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.
కొడంగల్, ఫిబ్రవరి 15 : కొడంగల్లో సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ జయంతి ఉత్సవా లను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, గిరిజనుల ఆత్మ గౌరవం ఉట్టిప డేలా రూ.24 కోట్లతో హైదరాబాద్లో బంజారా భవన్ నిర్మించినట్లు గుర్తు చేశారు. సేవాలాల్ గిరిజనులకే కాకుండా అందరికీ ఆరాధ్య దైవమన్నారు. కార్యక్రమంలో తాలుకా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్, గౌరవ అధ్యక్షుడు టీటీ రాము నాయక్, బాల్ సింగ్నాయక్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, గిరిజనులు పాల్గొన్నారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ జయంతిని గిరిజనులు బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. బొట్లవానితండాలో సేవాలాల్ చిత్రపటానికి బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నెహ్రూనాయక్, గిరిజన సోదరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బొంరాస్పేటలో వివిధ తండాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీ నిర్వహించారు. మహిళలు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
కులకచర్ల, ఫిబ్రవరి 15: గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని దాస్యనాయక్తండా, చౌడాపూర్ మండలం ఆర్లవాగుతండాలో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తున్నదన్నారు. లంబాడీలు అన్ని రంగాల్లో ముందు ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 500 వరకు జనాభా ఉన్న గిరిజ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్ నాయ క్, బీఆర్ఎస్ కులకచర్ల మండల బీఅధ్యక్షుడు శేరి రాంరెడ్డి, చౌడాపూర్ మండల అధ్య క్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, దాస్యనాయక్తండా గ్రామ సర్పంచ్ శంకర్నాయక్, వివిధ గ్రామాల గిరిజన సంఘాల నాయకులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు.
దోమ, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతిని జాగృత పరిచి న మహనీయుడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని బడెంపల్లి గ్రామ అనుబంధ తాండలో బుధవారం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తండాలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జడ్పీటీసి నాగిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. బొంపల్లి పెద్ద తండాలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకలకు జడ్పీటీసీ నాగిరెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బడెంపల్లి సర్పంచ్ కవితాశ్రీనివాస్రెడ్డి,బొంపల్లి పెద్ద తండా సర్పంచ్ శంకర్నాయక్, ఎంపీటీసీ రాములు, మాన్యనాయక్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి రాఘవేందర్రెడ్డి,యూత్ ప్రెసిడెంట్ మచ్చెందర్రెడ్డి పాల్గొన్నారు.
యాలాల, ఫిబ్రవరి 15: బంజారా గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను మండల పరిధిలోని తుప్పెర్లగడ్డ తండాలో బుధవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రెడ్యా నాయక్, సర్పంచ్ లలితా బాయి, గ్రామ బీఆర్ఎస్ అద్యక్షులు రూప్ సింగ్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లా రాంజీనాయక్ తండాలో సంత్ సేవాలాల్ జన్మించారన్నారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా సేవాలాల్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
బషీరాబాద్, పిబ్రవరి 15: మండలంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. మండలంలోని గిరిజన యువకులు, తండా ప్రజలు సేవాలాల్ జయంతిని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా తం డాల సర్పంచ్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. యువకులు సేవాలాల్ ఆశయాలను నేరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ తాండాల సర్పంచ్ లు శాంతి, పద్మ, దేవ్సింగ్, హన్మిబాయి, తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి, ఫిబ్రవరి 15: మండలంలోని గుర్రంగట్టు తండాలో సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోనీబాయి మాట్లాడుతూ బంజారాలు తమ సంప్రదాయాలను ఆచరించాలని వాటిని మరిచిపోకుండా భావితరాలకు అందించాలన్నారు. కార్యక్ర మంలో ఉప సర్పంచ్ పాండు, బీఆర్ఎస్ నాయకులు సంతోశ్, గోవర్ధన్ మోహన్, కార్వార్, చంద్ర నాయక్, నర్సింగ్, సద్ధార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.