తాండూరు, ఏప్రిల్ 29: పట్టణం అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యమిస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో పర్యటించిన ఆయన స్థానిక నేతలు, ప్రజాప్రతినిధు లతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మాతా శిశు ఆస్పత్రి రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందించడం అభినందనీయమన్నారు. వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరింత మంచి సేవలు అందించాలన్నారు. ఆస్పత్రికి కావాల్సిన మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.
అందుకు స్థానిక కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకొని తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరం ఉన్న ప్రతి వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలతో పాటు ప్రధాన రోడ్లకు ఇరువైపులా అండర్ డ్రేనేజీ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు కావాల్సిన సదుపాయాలతో పాటు ప్రభు త్వం అందిస్తున్న అన్ని పథకాలు ప్రతి ఇంటికి అందేలా స్థానిక నేతలు, కౌన్సిలర్లు చూడాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుకు రూ.కోటి నిధులతో పాటు అవసరం ఉన్న వార్డులకు మరిన్ని ప్రత్యేక నిధులు విడుదల చేస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ తన దృష్టికి తీసుకురావాలని సూ చించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజూగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీం, కార్యదర్శి శ్రీనివాస్, సంతోశ్గౌడ్, అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.