ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15 : ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టికృషితోనే గ్రామీణాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సిద్ధిస్తున్నాయని, ఫలితంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డిజిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి జిల్లాస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ 2023ఉత్తమ గ్రామాలుగా ఎంపికైన గ్రామాలకు అవార్డుల ప్రదానోత్సవం జూని యర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సంద ర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణకే అత్యధిక అవార్డులు వచ్చాయన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ..పల్లె ప్రగతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని అన్నారు.
ప్రతినెలా పల్లె ప్రగతి కింద నిధులు వస్తున్నందున గ్రామాల్లో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం పనులు నిర్వహించి పల్లెలను అందంగా తీర్చిదిద్దుతు న్నామన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల ఉన్నతిని ఆశించి జూనియర్ పంచాయతీ కార్య దర్శులను రెగ్యులరైజ్ చేశారన్నారు.అనంతరం జిల్లాలో ఉత్తమ గ్రామాలుగా ఎంపికైన 14గ్రామాలకు చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడి అవార్డులను అందించారు. అలాగే, 141 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజ్ ఉత్తర్వు లను ఈ సందర్భంగా వారికి అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, గ్రంథాలయసంస్థ చైర్మన్ రమణారెడ్డి, జిల్లా పరిషత్ వైస్చైర్మన్ గణేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కేశంపేట : స్వచ్ఛసర్వేక్షణ్లో నిర్వహించిన పాయింట్ల ఆధారంగా కేశంపేట గ్రామ పంచాయతీకి జిల్లా ఉత్తమ పంచాయితీ అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ కార్యా లయంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ తిరుమలరావు, జడ్పీచైర్మన్ అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డిల చేతుల మీదుగా సర్పంచ్ వెంకట్రెడ్డి, పంచాయితీ కార్యదర్శి విద్యావతి అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా చైర్పర్సన్ విశాల శ్రావణ్రెడ్డి, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఏపీవో అజీజ్ పాల్గొన్నారు.
మంచాల: మంచాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఆరుట్లకు అదేవిధంగా మంచాల పంచాయతీకి పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలవడంతో జిల్లా స్థాయి లో అవార్డులు దక్కాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరుట్ల సర్పంచ్ విష్ణు వర్ధన్రెడ్డి, మంచాల సర్పంచ్ జగన్రెడ్డిలకు ఆవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య నిరంజన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.
శంకర్పల్లి: గామాభివృద్ధికి నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శంకర్పల్లి మండలం జనవాడ గ్రామ సర్పంచ్ లలితానర్సింహ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్యెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేందర్,తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్: కడ్తాల్ గ్రామానికి ఉత్తమ అవార్డు వచ్చింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో… జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, డీఆర్డీవో ప్రభాకర్, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండలంలోని గంట్లవెల్లికి ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులను కైవసం చేసుకున్న ఫరూఖ్నగర్ మండలంలోని గంట్లవెల్లి గ్రామం శుక్రవారం జిల్లా స్థాయిలో మరో అవార్డును కైవసం చేసుకున్నది.ఈ మేరకు హైదారాబాద్లో గ్రామసర్పంచ్ యాదమ్మ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, వైస్ చైర్మన్ ఈట గణేష్, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
మొయినాబాద్: చిలుకూరు గ్రామ పంచాయతీకి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి చేతులమీదుగా చిలుకూరు సర్పంచ్ గునుగుర్తి స్వరూప జిల్లా స్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో మొయినాబాద్ ఎంపీపీ గును గుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ ఎంపీడీవో సంధ్య, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంతో పాటు గ్రామంలో సమస్య లు లేకుండా కృషి చేసిన పల్గుట్ట గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ జిల్లా స్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డు దకింది. ఈ అవార్డును శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి చేతుల మీదుగా పల్గుట్ట గ్రామ సర్పంచ్ మల్గారి జనార్దన్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి తాళ్ల నరేష్గౌడ్కు ఉత్తమ పంచాయితీ అవార్డు అందజేశారు.
నందిగామ: నందిగామ మండలం కన్హశాంతి వనం గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు లభించింది. అవార్డును శుక్రవారం గ్రామ సర్పంచ్ సరిత, కార్యదర్శి శ్రీనివాస్లకు జిల్లా కల్టెకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, జిల్లా అధికారులు అందజేశారు.