యాచారం, సెప్టెంబర్22: పరిసరాల పరిశుభ్రతతోనే సం పూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎంపీపీ కొప్పు సుకన్య అ న్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శుక్రవారం స్వచ్ఛతా వారోత్సవాలను నిర్వహించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన క ల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను ప రిశుభ్రంగా ఉంచుతామని విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయు లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మండలంలోని అ న్ని గ్రామాల్లో అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, ఏపీఎం లింగయ్య, ఈసీ శివశంకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తిరుపతయ్య ఉపా ధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నా రు. ఈ నెల 15 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా వారోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య ఏపీఏం రాజేశ్వరి ఆధ్వర్యం లో నిర్వహించిన స్వచ్ఛతా వారోత్సవంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి గ్రామంలోని ప్రధాన వీధులను ఊడ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ గోపాల్, రైతు బంధు సమి తి మండల, గ్రామాధ్యక్షులు వీరయ్య, బాలకృష్ణ, సీసీలు జరీనా, వసంత, రాములు, నర్సింహ, వీవోఏలు లావ ణ్య, శైలజ, వినీత, సుధ, అరుణ, అనసూయ, కవిత, విజయ, జానకీరాములు, ఛత్రునాయక్ పాల్గొన్నారు.