వికారాబాద్, నవంబర్ 23 : వికారాబాద్ పట్టణంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు కోసం బస్సులు నడపాలని వికారాబాద్ ఆర్టీసీ అధికారులను మంగళవారం గ్రామస్తులు కోరారు. దీంతో అధికారులు స్పందించి బుధవారం మైలార్దేవరంపల్లి, పీలారం గ్రామాల నుంచి బస్సును ప్రా రంభించారు. దీంతో మైలార్దేవరంపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి, విద్యా ర్థులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే బస్సు సౌక ర్యం కల్పించిన ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.