కొడంగల్, ఏప్రిల్ 6: కల్తీ ఆహార పదార్థాలు, నిషేధిత గుట్కాలతో అనారోగ్యం చేకూ రుతుందని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. శాంతి కమిటీ సమావేశంతో పాటు కొడంగల్ పరిధిలో రూ.ఐదు లక్షల నిషేధిత గుట్కాలు, కల్తీ టీపౌడర్ల పట్టివేతపై స్థానిక పోలీస్ స్టేషన్ లో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మండలంలోని రావులపల్లి గ్రామంలో కల్తీ సరుకులు, గుట్కాల అమ్మకాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు ముమ్మరంగా దుకాణాలు, పాన్షాప్లు, హోటల్స్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన కాశీనాథ్, మేఘరాజ్, లక్ష్మికాంత్ కిరాణ, పాన్షాప్ దుకాణాలను సోదా చేయగా ప్రభుత్వం నిషేధించిన గుట్కాలతో పాటు కల్తీ టీ పౌడర్ పట్టుబడినట్ల్లు తెలిపారు.
్లఈ ముగ్గురు వద్ద నుంచి దాదాపు రూఐదు లక్షల విలువగల గుట్కాలతో పాటు, కల్తీ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కల్తీ తయారీకి సంబంధించిన వస్తువులను హైదరాబాద్ నుంచి ఖరీదు చేసి ఇక్కడ కల్తీ వస్తువు లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. 20 క్వింటాళ్ల టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలానికి చెందిన మల్లికార్జున్ కల్తీ వస్తువులను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కల్తీ వ్యాపారాలు చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా రానున్న రంజాన్, శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకొని బుధ వారం స్థానిక పోలీస్స్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ప్రశాంతవాతావరణంలో వేడుకను జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మోమిన్పేట సీఐ వెంకట్, కొడంగల్ సీఐ ఇఫ్తేకార్అహ్మద్, కొడంగల్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్,ఏఎస్ఐ లు, బాల్కిషన్, గణేశ్లతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.