ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలు తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో చెట్లు కూలి ఇండ్లు, రోడ్లు ధ్వంసమై భారీగా నష్టం వాటిల్లింది. కొన్ని గ్రామాల్లో ఇండ్లు, పశువుల కొట్టాలపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయి చెల్లాచెదురయ్యాయి.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ