కేశంపేట, అక్టోబర్ 3: సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేశంపేట మండలంలోని సంగెం, అల్వాల గ్రామాల్లో 30 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శిలాఫలకాలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యేలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నిరంతరం అభివృద్ధికి తపించే కార్యసాధకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం అభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకువచ్చిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
కేశంపేట మండలంతో పాటు పలు ప్రాంతాల్లో నిరుపేదలకు సేవలందిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు ఎన్నం గోపాల్రెడ్డి అభినందనీయుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. సుమారు 20 ఏండ్ల కింద చనిపోయిన తన చిన్న కుమారుడు ప్రసూన్రెడ్డి జయంతి, వర్దంతి రోజుల్లో ప్రతి సంవత్సరం పేదలకు అన్నదానం, తదితర సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా గోపాల్రెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకుంటారని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళలకు గోపాల్రెడ్డి-సుకన్య కుటుంబసభ్యులు చీరలను మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, షాద్నగర్ మున్సిపల్ వైస్చైర్మన్ నటరాజన్, సర్పంచ్లు రేణుక, శ్రీలత, నవీన్కుమార్, జగన్నాయక్, కృష్ణయ్య, వెంకట్రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, యాదగిరిరావు, విశ్వనాథం, వెంకన్నయాదవ్, పర్వత్రెడ్డి, వేణుగోపాలాచారి, శేఖర్రెడ్డి, వెంకటేశ్గౌడ్, మధుసూదన్రెడ్డి, తిరుమలరెడ్డి శ్రీనివాస్, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, ఫకీరయ్యగౌడ్, యాదగిరిగౌడ్, ప్రేమ్కుమార్గౌడ్, శ్రీశైలం, వెంకటేశ్, మురళీమోహన్, యాదగిరియాదవ్లతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.