పరిశ్రమలు స్థాపించే వ్యాపారవేత్తలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలోనే అనుమతులను ఇస్తున్నది. అంతేకాకుండా వ్యాపారవేత్తలకు పలు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో అధికంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుపై వ్యాపారవేత్తలు ఆసక్తిని చూపుతుండగా ప్రభుత్వం వెన్నుదన్నుగా తోడ్పాటునందిస్తున్నది. కార్లు, జేసీబీ, హార్వెస్టర్, ట్రాలీతో కూడిన ట్రాక్టర్, బస్సులు, సిమెంట్ బ్రిక్స్ తయారీ తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 924 మందికి రూ.78.94కోట్లను ప్రోత్సాహకంగా అందించింది. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి భూమి, నిర్మాణం, యంత్రపరికరాల పెట్టుబడికి 15శాతం రాయితీ కల్పించడంతో పాటు సేల్ట్యాక్స్, విద్యుత్ చార్జీల్లోనూ రాయితీ కల్పిస్తూ వ్యాపారుల్లో భరోసాను కల్పిస్తున్నది. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ధికి బాటలు పడుతుండడంతో వికారాబాద్ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– పరిగి, మార్చి 12
పరిగి, మార్చి 12: పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, వారి అభివృద్ధ్దికి బాట లు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకుగాను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పరిశ్రమల స్థాపనకు అనుమతుల మం జూరును సరళతరం చేస్తూ టీఎస్ఐపాస్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా వివిధ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులను మంజూరు చేస్తున్నారు. దీనికితోడుగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పారిశ్రామికవేత్తలకు పలు రాయితీలను కల్పిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తం గా పరిశ్రమల ఏర్పాటుకు పలువురు వ్యాపారులు ముం దుకొస్తున్నారు. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు పలు రాయితీలు కల్పిస్తుండటంతో జిల్లా పరిధిలోనూ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 924 మందికి రూ.78.94 కోట్ల ప్రోత్సాహాన్ని పరిశ్రమల శాఖ అందించింది.
పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూమి, సంస్థ ఏర్పాటు, యంత్రపరికరాల మొత్తంలో 15 శాతం రాయితీ ఇస్తారు. జనరల్, బీసీ కేటగిరీల వారికి రూ.20 లక్షల గరిష్ఠ పరిమితి, ఎస్సీ, ఎస్టీల్లో పురుషులకు 35 శాతం గరిష్ఠంగా రూ.75 లక్షలు, మహిళలకు 45 శాతం గరిష్ఠంగా రూ.75లక్షల వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. సూక్ష్మ పరిశ్రమల్లో యంత్రాలపై పెట్టుబడికి రూ.25 లక్షల వరకు, చిన్న తరహా పరిశ్రమల్లో యంత్రాలపై పెట్టుబడికి రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు, సేవారంగంలోని పరిశ్రమలకు సంబంధించి సూక్ష్మ తర హా పరిశ్రమల్లో పరికరాలపై రూ.10 లక్షల వరకు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. స్థిర విద్యుత్ చార్జీల రాయితీ కింద ప్రతి యూనిట్కు రూపాయి చొప్పున వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి ఐదేండ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు యూనిట్కు రూ.1.50(గరిష్ఠంగా) అందిస్తారు. సేల్ ట్యాక్స్కు సంబంధించి ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి ఐదేండ్ల వరకు రాయితీ ఉంటుంది. వీటితోపాటు బ్యాంకు రుణం తీసుకొని పరిశ్రమను ఏర్పాటు చేసిన వారికి పావలా వడ్డీ కింద సబ్సిడీ ఇస్తారు. బ్యాంకు రు ణం చెల్లించిన తర్వాత 9 శాతం వడ్డీని పరిశ్రమల శాఖ సంబంధిత పరిశ్రమ నిర్వాహకులకు అందజేస్తుంది. జిల్లా పరిధిలో 924 మందికి ప్రోత్సాహాకాన్ని అందించగా అందులో సుమారు 720 మంది వాహనాలు తీసుకొని రాయితీలు పొందారు. వాహనాల రిజిస్ట్రేషన్కు వచ్చినప్పుడు వాటికి ట్యాక్సీ ప్లేట్ ఉన్నదా లేదా పరిశీలించి, రవాణా శాఖ అధికారుల నుంచి సమాచారం సేకరించి రాయితీ డబ్బు లను సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు. తద్వారా వారు ఉపాధి పొందడంతోపాటు ఆర్థికంగా ఎదిగేందుకు పరిశ్రమల శాఖ సహకరిస్తున్నది.
పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం జిల్లా పరిధిలో 2016 ఏప్రిల్ ఒక టో తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 28వ తేదీ వరకు వివి ధ వర్గాలకు చెందిన 924 మంది సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు రూ. 78,94,04,749 ప్రోత్సాహాన్ని అందించింది. ఇందు లో జనరల్ విభాగంలో ప్రోత్సాహక రాయితీ కింద ఏడుగురికి రూ.1,11,66,838, పావలావడ్డీ కింద 69 మందికి రూ.4,31,45,886, పవర్ కాస్ట్ రీయింబర్స్మెంట్ కింద 71 మందికి రూ.16,00,57,604, సేల్స్ట్యాక్స్ రీయింబర్స్మెంట్ కింద 22 మందికి రూ.20,33,14,507, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్ కింద ఆరుగురికి రూ.1,34,73,102, ఎస్సీలకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఒకరికి రూ.3,11,790, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 36 మందికి 4,18,55,540, పావలా వడ్డీ కింద పది మందికి 10,51,296, ఎస్టీలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 155 మందికి రూ. 16,86,50,280, పావలా వడ్డీ కింద ఎనిమిది మం దికి రూ.1,61,014 మంజూరయ్యాయి. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జనరల్ కేటగిరీ కింద వివిధ సబ్సిడీలుగా తొమ్మిది మందికి రూ.5,14,964, ఎస్సీలు 177 మందికి రూ. 4,81, 13,182, ఎస్టీలు 353 మందికి రూ.9,75,88,746 మంజూరయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు జనరల్ కేటగిరీల్లో 184 మందికి రూ.43,16,72,901, ఎస్సీలు 224మందికి రూ.9,13,31,808, ఎస్టీలు 516 మం దికి రూ.78,94,04,749 ప్రోత్సాహకంగా పొందారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు పలు రకాల రాయితీలను అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 924 మందికి రూ.78.94 కోట్లను ప్రోత్సాహకంగా అందించింది. ఇందులో 720 మందికి కార్లు, జేసీబీలు, హార్వెస్టర్లు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్లు తదితర వాటికి రాయితీతో అందించడం జరిగింది. తద్వారా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటకు అనేక మంది ముందుకొస్తున్నారు.
-వినయ్కుమార్, జనరల్ మేనేజర్, వికారాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం
వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద శ్రీరామ బ్రిక్స్ ఇండస్ట్రియల్ సంస్థను రూ.16లక్షలతో ఏర్పాటు చేశా. అందులో సిమెంట్ ఇటుకలను తయారు చేస్తున్నా. ఎస్ఎంఎంఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు సబ్సిడీలను అందిస్తున్నది. ఇటీవల సబ్సిడీలో భాగంగా నాకు రూ. 2,57,595లు వచ్చింది. సబ్సిడీ దాదాపుగా 15 శాతం అందింది.
-మురళి, శ్రీరామ బ్రిక్స్ ఇండస్ట్రియల్ వికారాబాద్