దోమ, అక్టోబర్ 25 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని భూగర్భ వనరులు, గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు. బుధవారం దోమలో జడ్పీటీసీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలతో మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మొద్దని వారు పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల సేంక్షేమం కోసం చేసిన పథకాలు, అభివృద్ధి పనులే ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ సంపదను సృష్టించి వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండని మాయమాటలతో వస్తున్న వారిని నమ్మితే మిమ్మల్ని నట్టేట ముంచుతారని పేర్కొన్నారు. దివంగత డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్రెడ్డి గత 40 ఏండ్లుగా పరిగి నియోజక వర్గ ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
హరీశ్వర్రెడ్డి మితృడైన దోమ రిటైర్డ్ టీచర్ బిచ్చిరెడ్డి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి నామినేషన్ వేసేందుకు రూ.10వేలు సాయం చేసి స్నేహ భావాన్ని చాటుకున్నాడు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, కొప్పుల అనిల్రెడ్డి, కొప్పుల ప్రతిమారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్, పార్టీ అధ్యక్షుడు గోపాల్గౌడ్, మాజీ ఎంపీపీ రాజగోపాల చారి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, నాయకులు మశ్చేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.