పరిగి : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని మినీ స్టేడియంలో గ్యాంగ్ శ్రీనివాస్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాస్ జ్ఞాపకార్థం అతడి స్నేహితులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. క్రీడాపోటీల ద్వారా క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతాయని చెప్పారు.
ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. పోటీల నిర్వహణతో క్రీడాకారుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యం వెలికితీయబడుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.