శంకర్పల్లి : 11వ శతాబ్ధంలో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివలింగానికి పూజలు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, మెదక్ జిల్లా ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన తన సతీమణితో కలిసి శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఇలాంటి అద్భుత శివలింగం చందిప్ప గ్రామంలో పదిలంగా ఉండడం హర్షనీయం అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో గుడి నెలకొని ఉండడం భక్తులకు ప్రశాంతతను కలిగిస్తుందన్నారు.
కాగా శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, గ్రామ సర్పంచ్ స్వప్నమోహన్, ఎంపీటీసీ దయాకర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనాథ్గౌడ్, లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సదానందంలు ఎమ్మెల్సీ దంపతులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మోహన్, పూజారి సాయిశివప్రసాద్, రాజేశ్గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.