షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామంలో నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం మున్సిపల్ సంబంధిత అధికారులతో కలిసి లింగారెడ్డిగూడ గ్రామాన్ని పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల నుంచి షాద్నగర్ పట్టణం నుంచి లింగారెడ్డిగూడ గ్రామానికి వచ్చే మురుగునీటితో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ మురుగునీరు గ్రామం నుంచి కాకుండా మరో మార్గం ద్వారా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నో సంవత్సరాలుగా మురుగుకాలువ సమస్య పరిష్కారం కాలేదని, ఎమ్మెల్యే చొరవతో సమస్య తీరనుండటంతో గ్రామ సర్పంచ్ మాధవి, ఎంపీటీసీ రామకృష్ణ, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషన్ జయంత్కుమార్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.