నందిగామ, ఏప్రిల్ 24 : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల జంగోనిగూడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జంగ బాల్రాజ్యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగ యాదయ్య, జంగ శేఖర్, జంగ యాదగిరి, నర్సింహ, రవి, వినయ్, సాయితో పాటు పలురులు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఒక్కరూ ఏదో రూపకంగా లబ్ధి పొందుతున్నారని, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్గౌడ్, చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జంగ రాజు, నాయకులు గోవర్ధన్, నర్సింహ, యాదయ్య, రాములు, కృష్ణ, నారాయణ, అశోక్, ఆంజనేయులు, యాదగిరి, ప్రభు, శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు.