షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతుబంధు, రైతుబీమా పథకాలను అందిస్తూ రైతు రాష్ర్టంగా తీర్చిదిద్ధిన ఘణత సీఎం కేసీఆర్కు దక్కిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లో ఎక్కడలేని విధంగా ప్రతి గుంటకు సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వివిధ సంక్షేమ పథకాల అమలుతో నిరుపేదలు లేని రాష్ర్టంగా తెలంగాణ ఆవిర్భవించనున్నదన్నారు.
రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే భూముల ధరలు పడిపోతాయని కొందరు జోస్యం చెప్పారని నేడు మన భూముల ధరలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. దళితులను ఆర్థికంగా ఎదుగాలనే సంకల్పంతో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఫరూఖ్నగర్ మండలంలో అర్హులైన 114 మందికి రూ. కోటి 14లక్షల 13వేల 224 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అదే విధంగా సీఎం సహాయనిధి కింద 126 మందికి మంజూరైన రూ. 47లక్షల 50వేల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం..
టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు అండంగా ఉంటామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అన్నారు. వారు లేనిదే పార్టీ లేదన్నారు. ప్రతి కార్యకర్తను సొంత బిడ్డల చూసుకుంటామన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి పార్టీ తరపున రూ. లక్షలు అందజేస్తున్నమని తెలిపారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న ఇన్ములనర్వ గ్రామనికి చెందిన జంగయ్య, అల్వాల గ్రామానికి చెందిన నర్సింహ రోడ్డు ప్రమాదంలో మరిణించగా టీఆర్ఎస్ నుంచి రూ. 2లక్షల ఇన్సూరెన్స్ ప్రోసిడింగ్ను బాధితుల కుంటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ ఖాజిఇద్రీస్ అహ్మాద్, ఫరూఖ్నగర్, కేశంపేట జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.