పరిగి టౌన్, జూన్ 7: జిల్లా టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి తొమ్మిది క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్లో రూ. 11 లక్షల వరకు ఉంటుందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం సాయం త్రం పరిగి సీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఎర్రచెల్లి గ్రామానికి చెందిన మస్తానయ్య నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు పరిగి సమీపంలో ఓ చిన్న షెడ్డును ఏర్పాటు చేసుకున్నా డు. కాగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం వారు మస్తానయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకట్రామయ్య, సీసీఎస్ సీఐ దాస్, ఎస్ఐ విఠల్రెడ్డి, సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.
250 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
నారాయణపేట జిల్లా మద్దూర్ నుంచి కొడంగల్ మీదుగా తాండూరు వైపు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న లారీని సోమవారం రాత్రి కొడంగల్లో పట్టుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మద్దూర్కు చెందిన దినేశ్కుమార్ 250 క్వింటాళ్ల బియ్యాన్ని కర్ణాటక రాష్ర్టానికి చెందిన లారీలో గుట్టుచప్పుడు కాకుం డా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని దినేశ్కుమార్తోపాటు లారీ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.