షాబాద్, మార్చి 24 : పేదల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ అమలు చే స్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. శుక్రవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 80 బృందాల ద్వారా 14,780 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 1,103 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,015 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డ ర్ చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడూ వైద్యసిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నా రు. వైద్యులు అవసరమున్న వారికి కంటి అద్దాలతోపాటు, మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 5,582 మందికి..
బొంరాస్పేట, మార్చి 24 : కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో సంబురంగా సాగుతున్న ది. నేత్ర సం బంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు శిబిరాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా శుక్రవారం జిల్లాలో 5,582 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 610 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 590 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 260 గ్రామాలు, 54 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
ఇది మంచి కార్యక్రమం
కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఇది మంచి కార్యక్రమం. సీఎం కేసీఆర్ పేదల పాలిట దైవంగా నిలిశారు. ఇది వరకు కంటి పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ.. ప్రస్తుతం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాల్లో అక్కడే వైద్యులు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మం దులు, అద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
– కృష్ణారెడ్డి, కమ్మెట గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా