వికారాబాద్, డిసెంబర్ 9: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం వికారాబాద్ కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో 50వ జిల్లా స్థాయి సైన్స్, గణితం, పర్యావరణ ప్రదర్శనతోపాటు రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన ము గింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు సూచించిన ప్రదర్శనలు కాకుండా విద్యార్థుల అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఎగ్జిబిట్లు తయారు చేసేలా ప్రోత్సహించాలన్నారు.
విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచే వచ్చే వారితో కలిసిపోయి ఉండటం ద్వారా వారి లో స్నేహసంబంధాలు పెరుగడమే కాకుండా కొత్త, కొత్త విషయాలు తెలుస్తాయన్నారు. ప్రదర్శనలో ఎంపిక కాని వారు అధైర్యపడకుండా కసితో, మం చి ఆలోచనలతో భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదుగాలన్నారు. మూడు రోజులుగా జరిగిన కార్యక్ర మంలో 220 ప్రదర్శనల నుంచి 79 ఎగ్జిబిట్లను ఎనిమిది మంది జడ్జిల ఆధ్వర్యంలో ఎంపిక చేయ డం జరిగిందన్నారు. జిల్లా నుంచి ఐదుగురు బాలికలు రాష్ట్ర స్థాయిలో జరుగనున్న సైన్స్ఫెయిర్కు ఎంపిక కావడంతో వారికి కలెక్టర్ నిఖిల బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రేణుకాదేవి, డీఆర్డీవో సైంటిస్ట్ మారుతీసాయిరాం, పర్యావరణవేత్త, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ ముత్తారెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణాదేవి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేటి నుంచి రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్
మండలంలో నిర్వహణ
కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రులు సబితారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి
రంగారెడ్డి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): 30వ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్-2022ను ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి డీఈవో సుశీందర్ రావు తెలిపారు. నందిగామ మండలంలోని రంగాపూర్ గ్రామంలోని నాట్కో హైస్కూల్లో రెండు రోజులపాటు ఈ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుందన్నారు. జాతీయ శాస్త్ర సాంకేతిక, సమాచార విభాగం, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, విద్యాశిక్షణ, పరిశోధన సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 33 జిల్లాల నుంచి ఎంపికైన 174 ప్రాజెక్టులను అక్క డ ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, అటవీ, దేవాదాయ శాఖ మం త్రి ఇంద్రకరణ్రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఇక్కడ ఎంపికైన ఎగ్జిబిట్లు జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని డీఈవో తెలిపారు.