బడంగ్పేట, జూన్ 21: మహేశ్వరం మండలంలో పంటలు చూసైనా..రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ బూచి చూపించి.. ఎగ్గొట్టే ప్రయ త్నం చేయొద్దని హితవు పలికా రు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో ఉన్న రైతులు యాదమ్మ, జంగయ్య, బాల్రాజ్ వేసిన వరి, చిక్కుడు పంటలను ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్న 19 మండలాల్లో రైతు భరోసాను నిలిపివేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉందని, రైతులు వ్యవసాయం చేయడం లేదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో దాదాపుగా రెండు లక్షల ఎకరాల కు సంబంధించిన రైతులకు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో నిజంగా రైతులు వ్యవసాయం చేస్తున్నారో.. లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేబినెట్ తీర్మానం చేయ డం ఏమిటని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా రైతులపై ముఖ్యమంత్రి కక్ష గట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి చూపించేందుకే రైతులు వేసిన పంటల వద్దకు వచ్చినట్లు ఆమె వివరించారు.
అధికారంలోకి వచ్చేందుకు రేవంత్రెడ్డి ఎన్నో అలవి కాని హామీలిచ్చి
మోసం చేస్తున్నారని.. అంతేకాకుండా రైతు భరోసాను కూడా ఇవ్వడం లేదన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చి 18 నెలలు దాటినా తమకు ఇప్పటికీ రైతుభరోసా రాలేదని రైతులు బాలరాజ్, జంగయ్య, యాదమ్మ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసు కెళ్లారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సమయానికి రైతుబంధు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు గుర్తు చేశారు. రైతులను కలిసిన తర్వాత ఎమ్మెల్యే మన్సన్ పల్లిలోని రోడ్డును పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాండు యాదవ్, వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.