బొంరాస్పేట, జనవరి 6 : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీది తండా (కొత్తూరు), ఎన్నెమీదితండా(వడిచెర్ల), కొత్తూరు, ఎనికేపల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో ఎడ్ల బండి, ట్రాక్టర్లతో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించారు. రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఊరేగింపుల్లో పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పైరవీలకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాలలో లాగొడి సహాయం జమ చేస్తున్నామని చెప్పారు. పాసు పుస్తకాలు రాని రైతులకు పాసు పుస్తకాలు అందించి రైతుబంధు, రైతుబీమా సహాయం అంద జేస్తా మని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మండలంలో ఇప్పటి వరకు 1.20 లక్షల మంది రైతులకు రూ.128 కోట్ల పెట్టుబడి సహాయం అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆయా గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. బురాన్పూర్ పాఠశాలలో విద్యార్థులు వేసిన రైతుబంధు ముగ్గులను పరిశీలించి అభినందించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్య క్షుడు చాంద్పాషా, సర్పంచ్ లక్ష్మీ, ఎంపీటీసీలు సుదర్శన్రెడ్డి, శ్రవణ్గౌడ్, ఎల్లప్ప, పార్టీ నాయకులు రమణారెడ్డి, దేశ్యానాయక్, నరేష్గౌడ్, మహేం దర్, రవిగౌడ్, బాలప్ప, ఢాక్యానాయక్ పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని పండుగ చేసిన రైతుబంధు
దౌల్తాబాద్, జనవరి 6 : ఉమ్మడి రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ పండుగ చేశారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు పథకం అన్నదాతల జీవితాల్లో వెలుగు నింపిందని, వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కలిగించి సాగుపై భరోసా కల్పించిందన్నారు. వ్యవసాయం రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే పట్నం నరేం దర్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయకుమార్, జడ్పీటీసీ మైపాల్, మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు భగవంతు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, పార్టీ నాయకులు నరోత్తంరెడ్డి, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్ మండల పరిధిలో…
పెద్దేముల్ జనవరి 6 : చదువుతోనే క్రమశిక్షణ అలవడుతుందని ప్రతి విద్యా ర్థి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా చదువుపై దృష్టి సారించాలని ఎంపీపీ అనురాధ రమేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మం బాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల వ్యవసాయాధికారి నసీరుద్దిన్ ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాలను నిర్వహించారు. అనంతరం రైతు బంధు వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ముగ్గుల, క్విజ్, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్, ప్రధనోపాధ్యాయులు రాములు పాల్గొన్నారు
ఊరూరా సాగుతున్న రైతుబంధు సంబురాలు
కులకచర్ల, జనవరి6 : కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ, రైతులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో రైతు బంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామంలో సర్పంచ్ బాలయ్య అధ్యక్షతన రైతు బంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేరి రాం రెడ్డి పాల్గొన్నారు. కుస్మసముద్రం గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, రాజప్ప, మలె కృష్ణ య్యగౌడ్, దోమ ఎంఈవో హరిశ్చందర్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఏఈవో అనిత, సర్పంచ్ కొత్త రంగారెడ్డి, ఉపసర్పంచ్ శివ కుమార్, వార్డు సభ్యులు యాదయ్య, గౌస్, అశోక్, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షుడు యాదయ్య, ఎంపీటీసీ శంకర్, పాలనర్సింలు, పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు.
కోట్పల్లి, జనవరి 6:మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రావిరాల ఆనంద్ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజ యలక్ష్మీ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ పాల్గొన్నారు.
మర్పల్లి, జనవరి 6: మండలంలోని కొంషెట్పల్లిలో రైతుబంధు మండలాధ్యక్షుడు నాయబ్గౌడ్ ఆధ్వర్యంలో రైతులు ఇండ్ల ముందు ముగ్గులు వేసి వారోత్సవాలు జరుపుకున్నారు.
మోమిన్పేట, జనవరి 6:ప్రభుత్వ పథకాలపై విద్యార్థులు అవగాహన కల్గివుండాలని టీఆర్ఎస్ మోమిన్పేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షడు వెంకట్ అన్నారు.గురువారం మండల పరిధిలోని చంద్రయాన్పల్లి గ్రామం కస్తూరిబా పాఠశాలలో 8,9,10 వ తరగతి విద్యార్థులకు రైతుబంధు పథకంపై పోటీలను మండల వ్యవసాయాధికారులు,పాఠశాల సిబ్బంది నిర్వహించారు.
యాలాల జనవరి 6 : సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణను మార్చడమే కాకుండా రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచారని టీఆర్ఎస్ నాయకులు రవీంధర్రెడ్డి అన్నారు. రైతుబంధు సంబరాల్లో భాగంగా యాలాల మండల కేంద్రంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తాండూరు రూరల్, జనవరి 6 ః తాండూరు మండలంలో గురువారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బిజ్వార్ గ్రామంలో సర్పంచ్ డి.నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అదేవిధంగా చెంగోల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
దోమ,జనవరి 6: రైతుబంధు పథకం అమలుపై విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వ హిచారు. దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు పాఠ శాల ఉపాధ్యాయులు, మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి ఆధ్వర్యంలో రైతుబంధు పథకంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.