యాసంగికి పెట్టుబడి సాయమందించేందుకు ‘రైతుబంధు’వొస్తుండు.. నేటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ పంటపంటకూ పెట్టుబడి సాయాన్ని అందజేస్తూ అన్నదాత మోములో ఆనందం నింపుతున్నారు. ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలను కర్షకుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ యాసంగికి వికారాబాద్ జిల్లాలోని 2,44,126 మందికిగాను రూ.299 కోట్లు, రంగారెడ్డి జిల్లాలోని 3,82,237 మందికిగాను రూ.378.72 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముందుగా రెండెకరాల్లోపు అన్నదాతలకు నేడు పెట్టుబడి సాయం అందనుండగా, మిగిలిన వారికి విడుతల వారీగా ప్రభుత్వం డబ్బులను జమ చేయనున్నది. గత ఐదేండ్లుగా పెట్టుబడి కష్టాలను తీర్చుతూ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా సీఎం కేసీఆర్ సాయమందిస్తుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రంగారెడ్డి, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ ప్రారంభమైనది. పంటల సాగులో రైతన్నలు నిమగ్నమయ్యారు. విత్తనాలు, ఎరువులు కొనేందుకు ఇబ్బంది పడుతున్న అన్నదాతకు మొదటి నుంచీ అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం.. ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని కూడా అందించాలని నిర్ణయించింది. ఈ నెల 28(బుధవారం) నుంచి పదో విడుత రైతుబంధు సా యం రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నది. ఇందుకో సం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పంటలను సాగు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేదని..తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వా త రైతన్న కష్టాలు చాలా వరకు తీరాయని.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రంగారెడ్డి జిల్లాలో 3,82,237 మం ది అర్హులైన రైతులకు యాసంగికి సంబంధించి పెట్టుబడి సా యంగా ప్రభుత్వం రూ.378.72 కోట్లను కేటాయించింది.
జిల్లాలో 3,82,237 మంది రైతులను అర్హులుగా గుర్తించిన అధికారులు.. వారికి నేటి నుంచి పదో విడుత రైతుబంధు సా యాన్ని అందించనున్నారు. నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతా ల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.378.72 కోట్ల నిధులను కేటాయించింది. కాగా వాన కాలం కంటే ఈ యాసంగికి 13,678 మంది రైతులు కొత్తగా నమోదయ్యారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తోపాటు పంట పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందిస్తున్నది. ఎకరాకు రూ.5 వేల చొ ప్పున ఏటా వానకాలం, యాసంగికి రెండు సీజన్లలో రూ.10 వేల చొప్పున ఇస్తున్నది.
నేటి నుంచి యాసంగి పెట్టుబడి సాయం రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నది. జిల్లాలో అర్హులైన రైతులు 3,82,237 మంది ఉండగా .. కొత్తగా 13,678 మంది నమో దయ్యారు. వీరందరికీ రైతుబంధు సాయం అందనున్నది.
– గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి