మంచాల, ఫిబ్రవరి 2: గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మంచాల మండలం 23గ్రామ పంచాయతీలకు శుక్రవారం అధికారులు బాధ్యతలు తీసుకున్నారు. మండల పరిధిలోని లోయపల్లి, ఆరుట్ల, మంచాల మేజర్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ కేవీవీ ప్రసాద్రావు, ఈవోఆర్డీ తేజ్సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ప్రత్యేక అధికారులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఆరుట్లలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్ను గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చీరాల రమేశ్, కావలి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ జంగయ్య పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని ప్రత్యేకాధికారులను గ్రామాలవారీగా శుక్రవారం నియమించారు. యాచారం, చౌదర్పల్లి ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో విజయలక్ష్మి, మాల్, నల్లవెల్లి ప్రత్యేకాధికారిగా ఎంపీవో ఉమారాణి, మేడిపల్లి, మల్కీజ్గూడ ప్రత్యేకాధికారిగా మిషన్ భగీరథ డీఈ రాజు, నందివనపర్తి, అయ్యవారిగూడ ప్రత్యేకాధికారిగా పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, గున్గల్, గడ్డమల్లయ్యగూడ ప్రత్యేకాధికారిగా తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, చింతపట్ల, మొండిగౌరెల్లి ప్రత్యేకాధికారిగా అగ్రికల్చర్ ఆఫీసర్ సందీప్కుమార్, కొత్తపల్లి, తక్కళ్లపల్లి ప్రత్యేకాధికారిగా మిషన్భగీరథ ఏఈ రజిత, కుర్మిద్ద, నజ్దిక్సింగారం ప్రత్యేకాధికారిగా ఇరిగేషన్ ఏఈ జయలక్ష్మి, మంథన్గౌరెల్లి, కేసీతండా ప్రత్యేకాధికారిగా పంచాయతీరాజ్ ఏఈ ఉస్మాన్, తాటిపర్తి, నానక్నగర్ ప్రత్యేకాధికారిగా ఇరిగేషన్ ఏఈ సునీత, తులేఖుర్దు, ధర్మన్నగూడ ప్రత్యేకాధికారిగా ఉప తహసీల్దార్ కీర్తిసాగర్, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లితండా ప్రత్యేకాధికారిగా ఇరిగేషన్ డీఈ మంజులదేవీ విధులు నిర్వహించనున్నారు.
కడ్తాల్ : సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించిందని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు మండల పరి ధిలోని ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడ్తాల్ గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారిగా ఎంపీడీవో రామకృష్ణ, ముద్విన్కు తహసీల్దార్ షేక్ ముంతాజ్, రావిచేడ్కు ఎంపీవో మధుసూదనాచారి, మైసిగండి గ్రామానికి మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలత, అన్మాస్పల్లి, గాన్గుమార్లతండాకు మిషన్ భగీరథ డీఈఈ సందీప్కుమార్, గడ్డమీదితండా, పెద్దవేములోనిబావితండాకు మండల పశువైద్యాధాకారి భానునాయక్, కర్క ల్పహాడ్, నార్లకుంటతండాకు పంచాయతీరాజ్ ఏఈ పరమేశ్, గోవిందాయిపల్లితండా, గోవిం దాయిపల్లికి ఐసీడీఎస్ సీడీపీవో సక్కుబాయి, వాసుదేవ్పూర్, బాలాజీనగర్తండాకు ఆర్అండ్ బీ ఏఈ రవితేజ, చరికొండ, పల్లెచెల్కతండాకు ఇరిగేషన్ ఏఈ నిఖిల, ఏక్వాయిపల్లి, మర్రిపల్లికి మిషన్ భగీరథ ఏఈ శ్రావ్య, సాలార్పూర్, చల్లంపల్లికి నాయబ్ తహసీల్దార్ వినోద్కుమార్, మక్తమాదారం, రేఖ్యాతండాకు మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ సురేశ్నాయక్, న్యామతాపూర్, కొండ్రిగానిబోడ్తండాకు పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించినట్లు ఎం పీడీవో రామకృష్ణ తెలిపారు. కడ్తాల్ పంచాయతీలో బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి ఎంపీడీవో రామకృష్ణకి వైస్ ఎంపీపీ ఆనంద్, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఆమనగల్లు : గ్రామ పంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ప్రభుత్వం ఆమనగల్లు మండలంలో 13 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆకుతోటపల్లి, సీతారాంనగర్ తండాకు మండల ఎంపీడీవో ఫారుక్ హుస్సేన్, మంగళపల్లి, చింతలపల్లి కి మండల తహసీల్దార్ లలిత, మేడిగడ్డ, శంకర్కొండతండాకు ఎంపీవో శ్రీలత, రాంనూతల, కోనాపూర్కు మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి, పోలేపల్లి, కొత్తకుంట తండాకు ఐబీ ఏఈ బి, తిరుపతయ్య, సింగంపల్లి, చెన్నంపల్లికి పంచాయతీరాజ్ ఏఈ కృష్ణయ్య, శెట్టిపల్లికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శరత్లను ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టారు.
మొయినాబాద్ : మండలంలోని 28 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరిపడా గెజిటెడ్ స్థాయి అధికారులు లేకపోవడంతో కలెక్టర్ ఒక్కో అధికారికి రెండు గ్రామ పంచాయతీల చొప్పున బాధ్యతలను అప్పగించారు. శుక్రవారం అధికారులు బాధ్యతలను చేపట్టారు. చిలుకూరు, అప్పోజిగూడ గ్రామాలకు ఎంపీడీవో సంధ్య, కనకమామిడి, అజీజ్నగర్, బాకారం జాగీర్కు తహసీల్దార్ గౌతంకుమార్, తోలుకట్టా, ఎతుబార్పల్లి గ్రామాలకు డిప్యూటీ తహసీల్దార్ ఎన్ వినోద్, హిమాయత్నగర్, ముర్తుజాగూడ గ్రామాలకు వ్యవసాయ అధికారి రాగమ్మ, చిన్నమంగళారం మేడిపల్లి గ్రామాలకు మండల విద్యాధికారి వెంకటయ్య, మొయినాబాద్, సురంగల్ గ్రామాలకు ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, పెద్దమంగళారం, ఎల్కగూడ ఆర్డబ్ల్యూఎస్ ఏఈఏ శివకుమార్, ఎన్కేపల్లి, నాగిరెడ్డిగూడ గ్రామాలకు పంచయతీరాజ్ శాఖ ఏఈ ఆశాజ్యోతి, కేతిరెడ్డిపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామాలకు పశువైద్యాధికారి శ్రీలత, అమ్డాపూర్ కాశీంబౌలి గ్రామాలకు పశువైద్యాధికారి దేవికారెడ్డి, వెంకటాపూర్, నక్కలపల్లి గ్రామాలకు పశువైద్యాధికారి ఎండీ హైమద్, కనకమామిడి, శ్రీరాంనగర్ గ్రామాలకు ఇరిగేషన్ ఏఈ జి లక్ష్మి, రెడ్డిపల్లి, కుతుబుద్దీన్గూడ గ్రామాలకు పంచాయతీరాజ్ ఏఈ రమ్య, చందానగర్, మోత్కుపల్లి గ్రామాలకు ఇరిగేషన్ ఏఈ ప్రియాంకలను నియమించారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : గ్రామాల్లో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. శుక్రవారం వారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటమ్మ, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో లక్పతినాయక్, సీడీపీవో శాంతిశ్రీ పాల్గొన్నారు.