తాండూరు, ఏప్రిల్ 21: నిత్యం రాకపోకలు, వర్షంతో దెబ్బతిన్న తాండూరు నియోజక వర్గం పరిధిలోని ఆర్ఆండ్బీ రోడ్లు ఇక సాఫీగా మార్చేందుకు ప్రణాళికలు చేసినట్లు తాం డూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి తెలిపారు. గురువారం తాండూరు పట్టణం శివాజీ చౌక్లో 167 నేషనల్ హైవేలో భాగంగా రూ.27 కోట్లతో తాండూరు కాగ్నానది-గౌతాపూర్ స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.631 కోట్లతో మహబూబ్నగర్-చించొల్లి రోడ్డు పనులకు ఈ వారంలో టెండర్లు జరుగనున్నట్లు తెలిపారు. గౌతాపూర్- కరణ్కోట్ రోడ్డుకు పనులకు సర్కార్ ఆమోదం లభించిందన్నారు. త్వరలో టెండర్లు వేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కొనసాగుతున్న జినుగూర్తి-తట్టెపల్లి రోడ్లతో పాటు త్వరలో బైపాస్ పనులు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు, కాం ట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
వర్షాకాలం వరకు తీవ్ర ఇబ్బందులుగా ఉన్న రోడ్లను బాగుచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపల్ పరిధిలో కూడ చక్కగా రోడ్లు వేయనున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, కౌన్సిలర్లు రాఘవేందర్, విజయదేవి, ప్రభాకర్గౌడ్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్య క్షుడు నయీం, టీఆర్ఎస్ నేతలు రాజుగౌడ్, నర్సింహులు, సంతోష్గౌడ్ ఉన్నారు.