సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. బేగంపేట్ ఆర్వోబీ మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.20కోట్లతో పనులు, రామకృష్ణాపురం (సికింద్రాబాద్) రైల్వే స్టేషన్ వద్ద ఆర్కేపురం ఆర్వోబీ పునరుద్ధరణ చర్యలకు రూ.6 కోట్ల పనులకు పచ్చజెండా ఊపింది. యూసుఫ్గూడ బస్తీ జంక్షన్ అభివృద్ధికి అంచనా రూ. 4.90 కోట్లకు, రహ్మత్నగర్ పీజీఆర్ విగ్రహం జంక్షన్ అభివృద్ధికి అంచనా వ్యయం రూ. 5.17 కోట్ల పనులకు కమిటీ ఆమోదం తెలిపింది. మిగతా అంశాలను పరిశీలిస్తే..
సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజఫర్ హుస్సేన్, ఫాహద్ బిన్ అబ్ధుల్ బిన్ అబ్ధత్, మహ్మద్ ఖాదర్, పొడవు అర్చన, మహమ్మద్ నసీరుద్దీన్, గౌస్ ఉద్దీన్ మహ్మద్, ఉప్పలపాటి శ్రీకాంత్, సబీహా బేగం, ఆవుల రవీందర్రెడ్డి, చింతల విజయశాంతి, కంది శైలజ పాల్గొనగా, కమిషనర్ రోనాల్డ్రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, శ్రీవాత్సవ, ఈఎన్సీ జియావుద్దీన్, సీఈలు దేవానంద్, కిషన్, అడిషనల్ కమిషనర్లు గీతా మాధురి, చంద్రకాంత్రెడ్డి, జయరాజ్ కెన్నెడీ, డాక్టర్ సునంద, జోనల్ కమిషనర్లు అభిలాష, రవికిరణ్, వెంకన్న, ముకుందరెడ్డి, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్ పాల్గొన్నారు.