షాద్నగర్రూరల్, మే 17 : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగిన ఉపాధి హామీ పనులు, వాటి నిధుల ఖర్చు వివరాలను ఏపీడీ నీరజ పరిశీలించారు. మున్సిపాలిటీలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో 2018 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఉపాధి హామీ పనుల కోసం రూ.14. 75 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు.100 రోజుల పనిదినాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో డీఆర్పీలు ఉపాధి హామీ నిధుల ఖర్చుపై నిర్వహించిన ఆడిట్ వివరాలను పరిశీలించారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడి పనులు ఎంత మేరకు పూర్తి చేశారో, వాటికి ఎంత ఖర్చు చేశారో సంబంధించిన వివరాలను డీఆర్పీలు వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్కుమార్, ఏపీవో ఆరుణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.