పెద్దఅంబర్పేట, నవంబర్ 24: మున్సిపాలిటీలోని ప్రతి ఊరిని రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి కళానగర్, పసుమాముల, కుంట్లూరు, తట్టిఅన్నారం తదితర ప్రాంతాల్లో ఆయన రోడ్షోలు చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కిషన్రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. వార్డులోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. గతంలో మున్సిపాలిటీలో పర్యటనకు వస్తే ఖాళీ బిందెలతో నిరసనలు, ధర్నాలు ఎదురుపడేవని, కానీ, ప్రతి ఇంటికి నల్లా నీటితో సీఎం కేసీఆర్ అందరి కష్టాలు తీర్చారని చెప్పారు. కళానగర్లో ఫంక్షన్హాల్, ఆలయాల నిర్మాణం చేసుకుందామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు సీఎం అభ్యర్థి కేసీఆర్ ఒక్కరేనని, కానీ కాంగ్రెస్కు 12 మంది ఉన్నారని కిషన్రెడ్డి విమర్శించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని, మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్లెం ప్రభాకర్రెడ్డి, ఈదమ్మల బలరాం, దండెం రాంరెడ్డి, గౌని భాస్కర్గౌడ్, గోవర్ధనం ప్రవీణ్కుమార్, పాడి జంగయ్య, కౌన్సిలర్లు హరిశంకర్, పరశురాంనాయక్, నాయకులు జోర్క రాము, వెంకటేశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, రాజు పాల్గొన్నారు. మరోవైపు, కుంట్లూరు జయప్రకాశ్నగర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ రోడ్షో నిర్వహించారు. మరోసారి కిషన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా దూసుకుపోతుంది. బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారానికి మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంజాపూర్, మునగనూర్, తొర్రూర్, కొహెడ, బ్రహ్మణపల్లి, ఉమర్ఖాన్గూడ, రాగన్నగూడ, తుర్కయాంజాల్, కమ్మగూడ, మన్నెగూడల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 9వ వార్డులో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మమతా శ్రీనివాస్రెడ్డి, నాయకులు గోపి, మహేశ్, తిరుమలేశ్ తదితరులున్నారు.