తాండూరు, మే 19: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండల పరిధిలో రూ. కోటి 40 లక్షల 38 వేల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకు స్థాపన, ప్రారంభోత్సవం చేశారు. యాలాల మండలం కోకట్లో రూ.22 లక్షల నిధులతో రైతు వేదిక ప్రారంభం, రూ.11.18 లక్షలతో మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాఘవపూర్ గ్రామంలో రూ.3 లక్షలతో, కమల్పూర్లో రూ.10 లక్షలతో, నాగసముందర్లో రూ.3 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. అన్నసాగర్లో రూ.12.16 లక్షలతో, అడల్పూర్లో రూ.12.16 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన శ్మశానవాటికలను ప్రారంభించారు. ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో పగిడ్యాల్లో రూ.5 లక్షలతో అడల్పూర్లో రూ.3 లక్షతో, బాణాపూర్లో రూ.10 లక్షలతో, అచ్చుతాపూర్లో రూ.3 లక్షలతో వేసిన సీసీ రోడ్లు ప్రారంభించారు. ముద్దాయిపేట్లో రూ.5 లక్షలతో సం గాయిపల్లితండాలో రూ.3 లక్షలతో, ముందలితండాలో రూ.2 లక్షలతో రాస్నంలో రూ.15 లక్షలతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. డీఎంఎఫ్టీ నిధుల్లో భాగంగా గంగాసాగర్లో రూ.16 లక్షలతో, బాగాయిపల్లిలో రూ.4 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగుకాలువలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో గ్రా మాలు, తండాలు అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథ కాలు ప్రవేశపెట్టి ముందుకెళుతుందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు చాల మేలు జరగ డంతో ప్రజలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువలు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలతో పల్లెల ముఖచిత్రం మారిందన్నారు.
మన ఊరు-మన బడితో పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలి పారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంకు ప్రత్యేక నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రధాన ఆర్ఆండ్బీ రోడ్లుతో పాటు ఔటర్ రింగ్రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసు కునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించా మన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలుపాలని కోరారు. కార్యక్ర మంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, యాలాల మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్య క్షుడు రవిందర్రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు పి.సాయిరెడ్డి, ఆయాగ్రామాల సర్పం చ్లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామంకు చెందిన నర్సింహులుకు దళిత బంధుద్వార వచ్చిన ట్రాక్టర్ను ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అందజేశారు. నియోజ కవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అంద జేశారు. అదే విధంగా ఈ నెల 29న నిర్వహించే జిల్లా స్థాయి డ్యాన్స్ పోటీల పోస్టర్లను డ్యాన్స్ మాస్టర్ గోపాల్, అశోక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు.