షాద్నగర్రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ నిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించిన నాయకలు, అధికారులు ఆ దిశగా జడ్పీ నిధులు వెచ్చిస్తున్నారు. జడ్పీ నిధులతో ఫరూఖ్నగర్ మండలంలోని గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. మండలంలోని చాల గ్రామాల్లో ఇప్పటికే సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వలు పూర్తయ్యాయి. అంతేకాకుండా మండలంలో వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు జడ్పీ నిధులతో శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.
ప్రస్తుతం మండలంలోని ఏ గ్రామం చూసిన శుభ్రతతో పాటు అందంగా కన్పిస్తున్నాయి. ప్రతి గ్రామాం అదర్శ గ్రామాన్ని తలపిస్తూన్నాయి. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించడమే అని చెప్పవచ్చు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో మండలంలోని గ్రామాలు శరవేగంతో అభివృద్ధి చెందుతుడటంతో గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మండల అభివృద్ధి రూ. కోటి 50లక్షల వెచ్చింపు..
ఫరూఖ్నగర్ మండలంలోన వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇప్పటికే జడ్పీ నిధుల నుంచి రూ. కోటి 50లక్షలు వెచ్చించారు. సీసీరోడ్లు, మహిళ సమక్య భవనాలు, అంతర్గత మురుగుకాల్వలు, ఇలా వివిధ అభివృద్ధి పనులతో పాటు పాఠశాలల అభివృద్ధికి జడ్పీ నిధులను వెచ్చించారు.