షాబాద్ : యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామిని శనివారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. జస్టిస్ సుభాష్రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి స్వామివారికి ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజరులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, దర్శనం చేయించి, స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత పునరుద్ధరిస్తున్న ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి రంజిత్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యాదాద్రిని ఇలలో అల వైకుంఠపురంగా, నభూతో, నభవిష్యత్ అన్న చందంగా పునరుద్ధరిస్తున్నారని తెలిపారు.
ఆలయ విశిష్ట చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్నారన్నారు. వారు చేస్తున్న ఈ నిర్మాణంలో తమవంతు బాధ్యతగా 1కిలో 10గ్రాముల బంగారాన్ని ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించానని చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయానికి అందజేస్తామన్నారు. ఈ బృహత్కార్యంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీ రంజిత్రెడ్డి కోరారు.