యాలాల : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతు దవాఖానలో చికిత్స తీసుకుంటుంది. దవాఖాన ఖర్చుల కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 60వేలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన ఎల్వోసీని శనివారం మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనేకమంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్లో కూడా నియోజకవర్గంలోని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిరుపేదలకు అండగా ఉంటానన్నారు. అంతేకాకుండా వారికి కార్పొరేటు వైద్యం అందించడం జరుగుతుందన్నారు.