ఇబ్రహీంపట్నం : ఆపత్కాలంలోనూ పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన కొంగర మల్లమ్మ రూ. 34వేలు, రాయపోల్ గ్రామానికి చెందిన నల్ల భాస్కర్గౌడ్కు రూ. 60వేలు, నాంపల్లి కృష్ణకు రూ. 42వేల చొప్పున సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయి. అట్టి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకు అందించే ఫలాలు ఎక్కడ కూడా నిలిచిపోవద్దన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతోమంది పేద ప్రజలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, చర్లపటేల్గూడ మాజీ సర్పంచ్ కాల్లె గణేశ్, రాయపోల్ సర్పంచ్ బల్వంత్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు హరిప్రసాద్గౌడ్, బాలుగౌడ్, నాయకులు మహేందర్, నవీన్, పర్వతాలు, హరిబాబు పాల్గొన్నారు.