ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన జిలమోని జంగయ్య అనారోగ్యంతో నగరంలోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతుండగా అతని వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నుంచి రూ. 2.50లక్షలు అలాగే, తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధిలోని నూరకంటి కిరణ్రెడ్డి అనే వ్యక్తికి రూ. 80వేల ఎల్ఓసీని కిరణ్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు జంగయ్య కుమారుడు తరుణ్కు క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజల వైద్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బర్ల జగదీశ్యాదవ్, టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, టీఆర్ఎస్వీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మైలారం విజయ్కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్, జగదీష్, విజయ్కుమార్, రాజు, లింగం పాల్గొన్నారు.