యాచారం : టీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
పార్టీని మరింత పటిష్ట పర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బండిమీది కృష్ణ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాష, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, కట్టెల కృష్ణ, శ్రీను, శివలింగం, జైపాల్రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.