కడ్తాల్ : ప్రభుత్వం నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మక్తమాదారం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ని నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ నిర్మాణాలు, మక్తమాదారం నుంచి నేదునూర్ వరకు బీటీ రోడ్డు, మక్తమాదారం నుంచి కడ్తాల్ వరకు బీటీ రోడ్డుతో పాటు రేఖ్యాతండాకు మట్టి రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి విన్నవించారు.
గ్రామాల అభివృద్ధికి దశాలవారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సులోచన, ఉప సర్పంచ్ గణేశ్, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహాగౌడ్, నాయకులు కృష్ణయ్య, జనిల్కుమార్ పాల్గొన్నారు.